ఆంధ్ర ప్రదేశ్
Varikuntla Subbaiah Funeral: సైనిక లాంచనాలతో ముగిసిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు, మతాలకతీతంగా భారీ ఎత్తున తరలివచ్చన ప్రజానీకం
Hazarath Reddyవిధి నిర్వహణలో ఎల్ఓసీలో అమరుడైన వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పలలో అశేష జనవాహిని మధ్య అంత్యక్రియలు జరిగాయి. మతాలకతీతంగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
AP High Court: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, ట్రాఫిక్ ఛలాన్ కట్టకపోతే విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు..పోలీసు అధికారుల తీరుపై ఫైర్
Arun Charagondaఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించింది.
Weather Forecast: ఏపీకి తప్పిన ముప్పు, తమిళనాడు వైపుకు కదిలిన అల్పపీడనం, రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్, భారీ వర్షాలతో చెన్నై విలవిల
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయుగుండంగా బలపడిన తర్వాత.. శ్రీలంక, తమిళనాడు తీరాలవైపుగా పయనించి అక్కడే తీరం దాటే సూచనలున్నాయని వెల్లడించారు.
Andhra Pradesh Shocker: ఏపీలో సంచలనం.. కూతురిని వేధించాడని కువైట్ నుండి వచ్చి చంపేశాడు, తానే హత్యచేశానని కువైట్ నుండి వీడియో రిలీజ్
Arun Charagondaఏపీలో సంచలనం జరిగింది. కూతురుని వేధించాడని కువైట్ నుంచి వచ్చి ఓ దివ్యాంగుడిని చంపేశాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో ఘటన జరిగింది. గత శనివారం తెల్లవారుజామున గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కేసుగా భావించి కేసు నమోదు చేశారు పోలీసులు.
Tirumala: తిరుమలలో భారీ వర్షం, అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేత
Arun Charagondaతిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమయ్యారు సిబ్బంది. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు.
Avanthi Srinivas: వైసీపీకి బిగ్ షాక్, పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, రాజీనామా లేఖను జగన్కు పంపించిన అవంతి..జనసేనలో చేరే అవకాశం!
Arun Charagondaఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడగా తాజాగా వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. పార్టీ, పదవులకు రాజీనామా చేసిన ఆయన...తన రాజీనామా లేఖను జగన్కు పంపించారు.
Droupadi Murmu Telangana Tour: తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన ఖరారు, మహిళావర్సిటీతో పాటూ పలు ప్రాంతాల్లో టూర్
VNSరాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఈ నెల 21వ తేదీన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. వర్సిటీ (Telangana Women University) శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 17న రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు ఆమె తెలంగాణలో గడపనున్నారు
Cold Wave in Telugu States: హైదరాబాద్ గజగజ, రాబోయే రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం, ఏపీలోనూ పడిపోయిన ఉష్ణోగ్రతలు
VNSబుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.7 డిగ్రీలు తగ్గి 29.3 డిగ్రీలుగాను, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.3 డిగ్రీలు తగ్గి 17.7 డిగ్రీలు, గాలిలో తేమ 43శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) అధికారులు వెల్లడించారు.
AP SSC Exam Date 2025: ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు, పూర్తి షెడ్యూల్ ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలో ప్రభుత్వ పరీక్షల విభాగం రూపొందించి ప్రభుత్వానికి పంపడం జరిగింది. దీనికి ప్రభుత్వం ఆమోదం లభించింది. తాజాగా పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేశారు.
Jagan Slams Chandrababu Govt: బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్ వన్గా ఉంది, మరి ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన వైఎస్ జగన్
Hazarath Reddyకాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని, దీనికి మూలాలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మొదలయ్యాయని కూటమి నేతలు ఆరోపణలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు
Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, అలజడిగా మారిన సముద్రం, అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం
Hazarath Reddyవిశాఖ ఆర్కే బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.తాజాగా బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం ఉంది. తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Weather Forecast: ఏపీలో అయిదు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింతగా బలపడనున్న అల్పపీడనం
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడనం దక్షిణ కోస్తా, రాయలసీమపై నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది .
Andhra Pradesh Shocker: చిన్నారిని చిధిమేసిన మూఢనమ్మకం, 40 రోజులుగా ఉపవాసం ఉంటూ చర్చిలో ప్రార్థనలు..చివరకు చర్చిలోనే ప్రాణం విడిచిన చిన్నారి
Arun Charagondaమూఢనమ్మకం చిన్నారిని చిదిమేసింది. నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య, లక్ష్మిల కూతురు భవ్యశ్రీ(8)కి బ్రెయిన్ ట్యూమర్.. వైద్యులు సర్జరీ చేయాలని చెప్పారు.సర్జరీ చేస్తే చిన్నారి బతకదని తల్లిదండ్రులు భయపడ్డారు. దానికి తోడు సర్జరీ చేసేంత డబ్బులు లేవు. ఆదూరిపల్లి చర్చిలో ప్రార్థనలు చేస్తే నయం అవుతుందని కొందరు చెప్పడంతో 40 రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేశారు. చివరికి చిన్నారి భవ్యశ్రీ చర్చిలోనే ప్రాణాలు విడిచింది.
Kakani vs Somireddy: నేను, విజయసాయి రెడ్డి వస్తాం, నీవు చెప్పేవి నిజాలే అయితే కాణిపాకంలో ప్రమాణం చేసే దమ్ముందా, సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన కాకాణి గోవర్థన్ రెడ్డి
Hazarath Reddyవైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో దారుణం, రొయ్యల చెరువు ఫోటోలు తీస్తున్నారని యువకుడిని స్తంబానికి కట్టేసి కొట్టిన రైతులు..వీడియో ఇదిగో
Arun Charagondaడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో కొంతకాలంగా ఆక్వా సాగుకు వ్యతిరేకంగా కొందరు యువకుల ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టును ఆశ్రయించి రొయ్యల చెరువులు మూసివేయించారు. అయితే సోమవారం సాయంత్రం రొయ్యల సాగు తిరిగి ప్రారంభిస్తున్నారని తెలుసుకున్న చిక్కం వీరదుర్గాప్రసాద్ ఆ ప్రాంతానికి వెళ్లి ఫొటోలు తీసే ప్రయత్నం చేయగా ఆగ్రహించిన రైతులు యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. ప్రస్తుతం బాధితుడికి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు.
Mudragada Padmanabha Reddy: వీడియో ఇదిగో, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటా, ముద్రగడ పద్మనాభ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని వెల్లడి
Hazarath Reddyవైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే నడుస్తానని తెలిపారు. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ బలోపేతం చేసి మళ్లీ జగన్ ని సీఎం గా చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం, లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలంటూ హాస్టల్ గోడ దూకి పరార్..
Hazarath Reddyవిశాఖ నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు వెళ్లిపోయారు. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలని విద్యార్థులు నలుగురు పరారయ్యారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు సౌకర్యం లేక 7 కిలోమీటర్లు చనిపోయిన శవాన్ని మోసుకెళ్ళిన ఆదివాసి గిరిజనులు, అల్లూరి జిల్లాలో ఘటన
Hazarath Reddyరోడ్డు సౌకర్యం లేక 7 కిలోమీటర్లు చనిపోయిన శవాన్ని మోసుకెళ్తున్న ఆదివాసి గిరిజనులు వీడియో వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ మడ్రేబు గ్రామానికి చెందిన సిలకమ్మ మరణించింది.
YS Jagan: జగన్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా, ఆ రెండు పత్రికలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు, ఇకపై ఎటువంటి కథనాలు ప్రచురించరాదని న్యాయస్థానం ఆదేశాలు
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రచురించిన తప్పుడు, దురుద్దేశపూర్వక కథనాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు, పోలీసుల విచారణకు సహకరించాలని సూచన
Hazarath Reddyప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జీవీకి అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.