తెలంగాణ
Paradise Hotel Fire: వీడియో ఇదిగో, సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో అగ్ని ప్రమాదం, తినే ప్లేట్లు వదిలి బయటకు పరుగులు పెట్టిన కస్టమర్లు
Hazarath Reddyసికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురై తినే ప్లేట్లను వదిలి బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన హోటల్ స్టాఫ్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు
Telangana Police: తస్మాత్ జాగ్రత్త!, సోషల్ మీడియా రీల్స్ పేరుతో అతి చేస్తే ఇకపై అంతే, కఠినమైన కేసులు తప్పవని పోలీసుల హెచ్చరిక
Arun Charagondaయువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. కఠినచట్టాలు ప్రయోగించి జైలు ఊచలు లెక్కబెట్టిస్తామని తెలిపారు
KTR Vs Ponguleti: ఎఫ్టీఎల్లోనే పొంగులేటి ఫాంహౌజ్, ముందు కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలు కూలగొట్టాకే ప్రజల దగ్గరికి వెళ్లాలని కేటీఆర్ డిమాండ్
Arun Charagondaతెలంగాణలో అక్రమకట్టడాల కూల్చివేత రగడ కొనసాగుతూనే ఉంది. నా ఇల్లు బఫర్ జోన్లో ఉన్నా, FTLలో ఉన్నా వెంటనే కూలగొట్టండని హైడ్రాకి ఆదేశాలు జారీ చేశారు మంత్రి పొంగులేటి. దీనిపై స్పందించిన కేటీఆర్..పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదని.. అన్ని శాటిలైట్ ఇమేజ్లు ఉన్నాయన్నారు.
Woman Gives Birth in Chair: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే శిశువును ప్రసవించిన మహిళ
Hazarath Reddyనల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ కుర్చీలోనే శిశువును ప్రసవించింది. నేరడుగొమ్మ మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణి గురువారం రాత్రి పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు
KTR About Revanth Reddy Delhi Tour:రైతులకు మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?..కేటీఆర్ ఫైర్, చల్లో ఢిల్లీ కాదు చలో పల్లె చేపట్టాలని సవాల్
Arun Charagondaరైతులకేమో మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ కు దమ్ముంటే... “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప…అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా.. అని ప్రశ్నించారు
Cockroach Found in Dosa: బాబోయ్..దోసలో మాడిపోయిన బొద్దింక, తినడానికి రెడీ ఒక్కసారిగా షాకయిన కస్టమర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ - పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్డు పిల్లర్ నెంబర్ 106 వద్ద శ్రీ రాఘవేంద్ర హోటల్లో ఓ కస్టమర్ తినే దోసలో మాడిపోయిన బొద్దింక వచ్చింది. దోసెను తినడానికి రెడీ అయిన కస్టమర్ ఈ బొద్దింకను చూసి ఒక్కసారిగా ఖంగుతున్నాడు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.
MP Dharmapuri Aravind On KCR: కేసీఆర్ చచ్చినా బీజేపీలోకి రానిచ్చే ప్రసక్తేలేదు, కేటీఆర్- కవితలది అదే పరిస్థితి, తేల్చిచెప్పిన ఎంపీ అరవింద్..
Arun Charagondaనిజామాబాద్లో మీడియాతో మాట్లాడారు ఎంపీ ధర్మపురి అరవింద్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై స్పందించిన ఆయన..కేసీఆర్, కేటీఆర్, కవితను చచ్చినా బీజేపీ దగ్గర్లోకి కూడా రానివ్వం అని తేల్చిచెప్పారు. వేరేటోడు ఎటు పోతే ఏంది? అని తన స్టైల్లో చెప్పారు.
Konda Murali Vs Baswaraj Saraiah: వరంగల్ కాంగ్రెస్లో రచ్చకెక్కిన విభేదాలు, కొండా వర్సెస్ సారయ్య, దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సారయ్యకు కొండా సవాల్
Arun Charagondaవరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫైర్ అయ్యారు. తాను పార్టీ మారితే రాజీనామా చేసిన.. నీకు దమ్మ్మంటే రిజైన్ చేసి గెలువు అంటూ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యకు సవాల్ విసిరారు. బస్వరాజ్ సారయ్య లాగా ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారలేదని ఆరోపించారు కొండా మురళి.
Warangal: గన్పారేసుకున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్, రోడ్డుపై గన్ని గుర్తించి కమిషనర్కు అందజేసిన పారిశుధ్య కార్మికుడు
Arun Charagondaవరంగల్ ఎంజీఎం జంక్షన్ లో ఎస్ఎల్ఆర్ఎన్ గన్ ను పారేసుకున్నాడు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్. యూనివర్సిటీ పరిధిలో ఉన్న బెటాలియన్ ను తరలించే క్రమంలో రోడ్డుపైన పడిపోయింది గన్. గన్ ను గుర్తించిన వరంగల్ మహానగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు.. వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ కు అందించారు. దీంతో తుపాకీ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే.
Viral Video: హైదరాబాద్ లో వింత వర్షం.. ఒకే కాలనీలో ఒక పక్క వర్షం.. మరోవైపు పొడి వాతావరణం.. ఆశ్చర్యపోయిన స్థానికులు.. (వీడియో)
Rudraహైదరాబాద్ లో ఓ కాలనీలో వర్షం పడింది. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా? అయితే, ఆ కాలనీలో ఎదురుగా వర్షం పడుతున్నా అక్కడే ఉన్న స్థానికులు మాత్రం తడవలేదు.
CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, రాజీవ్ విగ్రహావిష్కరణకు అగ్రనేతలను పిలవనున్న కాంగ్రెస్ నేతలు, పీసీసీ చీఫ్ ఎన్నికపై రానున్న క్లారిటీ!
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు రేవంత్ రెడ్డి. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు అగ్రనేతలు
Telangana Shocker: షాకింగ్ వీడియో, ప్రేమ వ్యవహారం..ఫ్రెండ్ అని చూడకుండా చంపేసిన స్నేహితులు, బాలాపూర్లో దారుణం, ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ తల్లిబాధ వర్ణనాతీతం
Arun Charagondaహైదరాబాద్ బాలాపూర్లో అమానుషం చోటు చేసుకుంది. యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్ను హత్య చేశారు స్నేహితులు. బాలాపూర్లో మండి 37 హోటల్ వద్ద ప్రశాంత్ను కత్తితో పొడిచి హత్య చేశారు స్నేహితులు. హత్య చేసి పరారైన నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు.
Fine Rice For Ration Card Holders: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్! జనవరి నెల నుంచి ఇకపై రేషన్ షాపుల్లో సన్నబియ్యం, ప్రకటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
VNSరేషన్ కార్డు దారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే జనవరి నుండి చౌక ధరల దుకాణాల్లో (Ration Shops) సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ సమావేశం నిర్వహించారు.
Barrelakka Crying Video: నాకే పాపం తెలియదంటూ ఏడ్చేసిన బర్రెలక్క, ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిందంటూ వార్త వైరల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyకర్నె శిరీష అలియాస్ బర్రెలక్క తాలూకు ఓ వీడియో నెట్టింట తాజాగా వైరల్ అవుతోంది. అందులో బర్రెలక్క కన్నీరు పెట్టుకుంటూ.. తాను ఏ తప్పు చేయలేదని, అతనెవరో కూడా తనకు తెలియదని చెప్పడం వీడియోలో కనిపించింది.
Hyderabad: వీడియో ఇదిగో, ట్రాఫిక్లో డబ్బులు విసురుతూ రీల్స్ తీసిన యూట్యూబర్, ఇదేం పిచ్చి అంటూ మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyసోషల్ మీడియాలో లైకుల కోసం రోజురోజుకీ యువత చేస్తున్న పిచ్చి పనులు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో ట్రాఫిక్లో డబ్బులు విసురుతూ యూట్యూబర్ & ఇన్స్టాగ్రామర్ అయిన its_me_power రీల్స్ తీశారు.
Telangana: వీడియో ఇదిగో, హరీష్ రావు రాకతో యాదాద్రి అపవిత్రం అయిందంటూ నీటితో శుద్ది చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
Hazarath Reddyహరీష్ రావు రాకతో యాదాద్రి అపవిత్రం అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీటితో శుద్ది చేశారు. యాదగిరిగుట్ట కొండపైన ఆలయ పరిసరాలను నీటితో శుద్ధి చేస్తున్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వీడియోలు వైరల్ గా మారాయి.
IMD Alert For Telangana: తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన, ఐదు రోజుల పాటూ భారీ వర్షాలుంటాయని ఐఎండీ హెచ్చరిక, ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
VNSతెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Karimnagar: ఓవర్ లోడ్ అయిన బస్సు, నేను నడపలేను బాబోయ్ అంటూ నడిరోడ్డుపైనే నిలిపివేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, 55 మంది ఎక్కాల్సింది ఏకంగా 110 మంది ఎక్కారంటూ ఆవేదన
VNSసామర్థ్యానికి మించి(Overloaded) ప్రయాణికులు ఎక్కడంతో బస్సు నడపడం ఇబ్బందవుతుం దంటూ నడి రోడ్డుపై నిలిపివేసిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో(Huzurabad) జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వరంగల్ వెళ్తుండగా, హుజూరాబాద్ బస్టాండ్లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్సు ఎక్కారు.
BRS Protest For Runa Mafi: రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతులు, తుంగతుర్తిలో బీఆర్ఎస్ శ్రేణులపై రాళ్లదాడి, పలు చోట్ల జర్నలిస్టులపై అటాక్, తీవ్రంగా తప్పుబట్టిన కేటీఆర్, హరీశ్ రావు
Arun Charagondaరైతుల రుణమాఫీ కోసం కదం తొక్కింది బీఆర్ఎస్. రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేపట్టింది. ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పిలుపుతో రైతులు కదిలివచ్చారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టారు.
Telangana: 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 మంది, యాక్సిడెంట్ భయంతో నడిరోడ్డు మీద ఆపేసిన డ్రైవర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyకరీంనగర్ జిల్లాలో నడి రోడ్డుపై ఆర్టీసి బస్సును డ్రైవర్ ఆపేశాడు. హుజురాబాద్ బస్సులో 55 మందికి గాను 110 మంది ఎక్కారని, సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదని కొంతమంది ప్రయాణికులు దిగాలని డ్రైవర్ బస్సును ఆపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.