Coronavirus in TS| (Photo Credits: PTI)

Hyderabad, November 6:  తెలంగాణలో కొవిడ్19 తీవ్రత నియంత్రణలోనే ఉన్నా, కోలుకునే వారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుండటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. మరోవైపు అంతకు రెట్టింపు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఇది పండగల సీజన్ కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ మళ్ళీ విజృంభించే ప్రమాదం పొంచి ఉంది.

రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 46,970 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,602 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 676 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 45,31,153 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 247,284కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో295 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 137, రంగారెడ్డి నుంచి 118, నల్గొండ మరియు ఖమ్మం జిల్లాల నుంచి చెరి 79 కేసులు, కొత్తగూడెం 77, కరీంనగర్ 76 కేసుల చొప్పున నమోదుచేశాయి.  రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 04 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,366కు పెరిగింది.

అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 982  మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 226,646 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,272 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.