How Indian Cinema Treats Transgenders? ట్రాన్స్ జెండర్స్ ని మన మీడియా మరియు సినిమా ఎలా చూపిస్తోంది?

How Indian Cinema Treats Transgenders?  ట్రాన్స్ జెండర్స్ ని మన మీడియా మరియు సినిమా  ఎలా చూపిస్తోంది?

లింగం, లైంగికత మరియు భారతీయ మీడియాపై రాష్ట్ర స్థాయి సమావేశం సెప్టెంబర్ 5,6 తేదీల్లో మదురైలోని అమెరికన్ కాలేజీలో జరిగింది.

ఈ అంశాన్ని, అందులోని వ్యక్తులు (ట్రాన్స్ జె oడెర్స్)ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపడానికి కళాశాల సామాజిక కార్య విభాగం మరియు మదురైలోని ట్రాన్స్‌జెండర్ రిసోర్స్ సెంటర్ సంయుక్తంగా ఈ కార్య క్రమాన్ని నిర్వహించింది.

రెండు రోజుల ఈ కార్యక్రమంలో చాలా మంది విద్యార్థులు, విద్యావేత్తలు మరియు పాత్రికేయులు పాల్గొన్నారు. అందులో చర్చించిన విషయాలు క్లుప్తంగా మీకోసం.

    • ముందుగా “LGBTQI కి చెందిన వారు ఎక్కువ లైంగిక భావాలను కలిగి ఉంటారు అనే ఆలోచన తప్పని, వారు కలిసిన ప్రతి ఒక్కరితోనూ ప్రేమలో పడతారనుకోవడం తప్పని అసిస్టెంట్ ప్రొఫెసర్ మహాలక్ష్మి రాఘవన్ సూచించారు.
    •  “భారతీయ మీడియాలో ఎల్జిబిటిక్యూ  కమ్యూనిటీపై స్టీరియోటైప్స్” ఆపాలని మరికొందరు పేర్కొన్నారు.

  • వార్తలు మరియు మీడియా సెషన్‌లో ట్రాన్స్ జెండర్స్ గురించి వివరంగా చర్చించాల్సి ఉండగా, ట్రాన్స్ కమ్యూనిటీ పై వార్తా సంస్థలు చేస్తున్న రిపోర్టింగ్, ఉపయోగించే పదజాలం  చాలా బాధాకరమని వారు వాపోయారు.
  • ట్రాన్స్ జెండర్స్ ఆత్మహత్యలను నివేదించేటప్పుడు, తల్లిదండ్రులు తమ పిల్లలను అర్థం చేసుకోకపోవడం పై  విశ్లేషించడంలో వైఫల్యం చందుతున్నారని అందులో కొందరు అభిప్రాయపడ్డారు.

  • ట్రాన్సజెండర్స్  కూడా మనుషులేనని వారికి కూడా గౌర మర్యాదలు అతయంత ముఖ్యమని. మీడియాలో వారిని సంబోధించే టప్పుడు, వాడే  పదజాలం ఫై చాలా జాగ్రత్త వహించాలని మరి  కొందరు సూచించారు.
  • ‘సినిమా దర్శకులు ట్రాన్సజెండ ర్స్ కు క్షమాపణ చెప్పాలిని’ సమాజంలో వారిని అగౌరవపరిచే విధంగా తమ ఫై  డైలాగులు, సన్నివేశాల చూపిస్తున్నారని “ఉదా: వడివేలు యొక్క‘వాడా...నీ యబ్బ" పంక్తిని తీసుకోండి. దాని అర్థం ఏమిటి? ఇది ఎలా ఫన్నీ? అని కొందరు నిలదీశారు.

    • “సినిమాలో చాలా కాలంగా, ట్రాన్స్ పీపుల్ చిత్రణ కామెడీ కోసమే ఉంటుందని  దర్శకులందరూ మాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని మరి కొందరు డిమాండ్  చేశారు. .
    • తమిళ్ డైరెక్టర్ "శంకర్, అమీర్, గౌతమ్ మీనన్, తియగరాజన్ కుమారరాజా, ఆనంద్ శంకర్ వంటి దర్శకులు మాకు క్షమాపణ చెప్పాలి" వారు నిలదీశారు.
    • వార్త పత్రికల కూడా ప్రతి పండుగకు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది?’ వంటి అసంబద్ధమైన ప్రశ్నలను అడగడం మానాలని వారు  కోరారు.

  • ట్రాన్స్‌ పీపుల్స్‌ కి సినిమా, న్యూస్‌ రూమ్‌లు, పబ్లిషింగ్‌ హౌస్‌లలో భాగం కావడానికి అవకాశం ఇస్తేనే ప్రజల్లో వారికి నిజమైన న్యాయం జరుగుతుందని కొందరు అభిప్రాయ పడ్డారు.
  • పుస్తకాల నుండి సినిమా వరకు ట్రాన్స్ ప్రజలు వ్రాసిన, చేసిన కళాత్మక రచనలు ప్రజల దృక్పథాలను మార్చడంలో ఎంతగానో మార్పు తీసుకొస్తాయని మరికొందరు సూచించారు.

(The above story first appeared on LatestLY on Sep 11, 2019 10:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).