Cyclone Biparjoy: అతి తీవ్ర తుపానుగా మారిన బిపర్‌జోయ్.. 15న తీరానికి.. మాండ్వీ-కరాచీ మధ్య తీరం దాటనున్న తుపాను.. గంటకు గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు
Cyclone | Representational Image (Photo Credits: Pixabay)

Newdelhi, June 11: అరేబియా సముద్రంలో (Arabian Sea) ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) అతి తీవ్ర తుపానుగా (Severe Cyclone) మారింది. సౌరాష్ట్ర-కచ్, దానిని ఆనుకుని ఉన్న పాకిస్థాన్ (Pakisthan) తీరాల్లో ఈ నెల 15న మధ్యాహ్నం అది తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ-IMD) తెలిపింది. ప్రస్తుతం ఇది తూర్పు మధ్య అరేబియా సముద్రంలో పోర్‌బందర్‌కు దక్షిణ-నైరుతికి 480 కిలోమీటర్ల దూరంలో, ద్వారకకు దక్షిణ-నైరుతిగా 530 కిలోమీటర్ల దూరంలో, కచ్‌లోని నలియాకు దక్షిణ-నైరుతికి 610 కిలోమీటర్ల దూరంలో, పాకిస్థాన్‌లోని కరాచీకి దక్షిణాన 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు

జూన్ 14 వరకు ఇది ఉత్తరం వైపుగా కదిలే అవకాశం ఉందని, ఆ తర్వాత ఉత్తరం-ఈశాన్యం దిశగా కదులుతూ సౌరాష్ట్ర, కచ్..  దానికి ఆనుకుని ఉన్న మాండ్వీ (గుజరాత్), కరాచీ (పాకిస్థాన్) మధ్య పాకిస్థాన్ తీరాలను దాటి 15న మధ్యాహ్నం అత్యంత తీవ్ర తుపానుగా మారుతుందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.