Voluntary Pay Cut: కరోనాపై పోరుకు ఈసీ అండ, ఏడాదిపాటు తమ జీతాల నుంచి స్వ‌చ్ఛంధంగా 30 శాతం కోత, ముందుకొచ్చిన ముగ్గురు ఎన్నికల కమిషనర్లు
Chief Election Commissioner Sunil Arora (Photo Credits: ANI)

New Delhi, April 13: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (Coronavirus) మహమ్మారిపై పోరులో కేంద్ర ఎన్నిక‌ల సంఘం (Election Commission of India) కూడా తన వంతు సహాయం అందించింది. ఇందులో భాగంగా ఏడాదిపాటు త‌మ మూల వేత‌నం నుంచి 30 శాతం చొప్పున‌ స్వ‌చ్ఛంధంగా కోత (voluntary pay cut) విధించుకుంటున్న‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు ప్ర‌క‌టించారు.

కరోనా కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం, మూడు జోన్లుగా దేశ విభజన

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా సహా మొత్తం ముగ్గురు కమిషనర్లు క‌రోనాపై పోరులో చేయూత‌నందించేందుకు ముందుకు వచ్చారు. వీరిలో అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఉన్నారు.

కరోనా మహమ్మారిని ఓడించేందుకు ప్రభుత్వం, పౌర సమాజం చేస్తున్న పోరుకు భారీ స్థాయిలో వనరుల ఆవశ్యకత ఉంద‌ని, దీనికి అన్ని వర్గాల నుంచి సహకారం లభించడం అవసర‌మ‌ని, త‌మ వేతనాల కోతవల్ల ప్రయోజనం ఉంటుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని ఎన్నిక‌ల కమిషనర్లు అభిప్రాయపడ్డారు.

Here's ANI Tweet

సర్వీస్‌ నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం కమిషనర్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా వేతనం అందుకుంటారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.2.50 లక్షలుగా ఉంది.

జాతినుద్దేశించి రేపు ప్రసగించనున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోడీతో (PM Modi)సహా ప్రస్తుత మరియు మాజీ శాసనసభ్యుల జీతాలు, భత్యాలు మరియు పెన్షన్లను తగ్గించనున్నట్లు గత వారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా, అధ్యక్షుడు రామ్ నాథ్ కోవిడ్, ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు మరియు అన్ని రాష్ట్రాల గవర్నర్లు స్వచ్ఛందంగా పే-కట్ చేయాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంటు సభ్యుల జీతం, భత్యాలు మరియు పెన్షన్ 1954 ను సవరించే ఆర్డినెన్స్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది,

2020 ఏప్రిల్ 1 నుండి ఒక సంవత్సరం వరకు చట్టసభ సభ్యుల భత్యాలు మరియు పెన్షన్లను 30 శాతం తగ్గించింది. అలాగే ఎంపీ ల్యాడ్స్‌ నిధులను సైతం రెండు సంవత్సరాలపాటు నిలిపివేస్తూ నిర్ణయం కేంద్రం తీసుకుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు సైతం 30 శాతం తక్కువ వేతనాలు తీసుకోవడానికి ముందుకు వ‌చ్చారు.