UP Shocker: అన్నకు సహకరించిందంటూ..తల్లిదండ్రుల ముందే బాలికపై 8 మంది అత్యాచారం, బాలికతో ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకున్న నిందితుడు, యూపీలో అమానుష ఘటన, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Lucknow, July 7: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఓ బాలికను తన తల్లిదండ్రులు ముందే 8 మంది సామూహికంగా అత్యాచారానికి (Moradabad girl raped by eight of family) పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అమ్రోహా జిల్లాలో చోటు చేసుకుంది. యూపీ పోలీసులు, TOI కథనం ప్రకారం... అమ్రోహా రైల్వే స్టేషన్‌ సమీపంలో నివాసం ఉండే ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి, పొరుగింటి అమ్మాయితో కలిసి జూన్‌ 27న ఊరి నుంచి వెళ్లిపోయారు.

వారు వెళ్లిన తరువాత జూన్‌ 29వ తేదీన వీరివురి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొంది. ఈ ​క్రమంలో అమ్మాయి తరపున వాళ్లు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను ఓ ఇంటికి తీసుకెళ్లారు. వారిద్దరు లేచిపోవడానికి తన అన్నకు సహాయపడిందనే అనుమానంతో అతని చెల్లెలను తీవ్రంగా కొట్టారు. అంతే కాకుండా దీనికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఆ బాలిక తల్లిదండ్రుల ఎదురుగానే ఆమెపై 8 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

బ్యాంకు మేనేజరే కామాంధుడై..లోన్ల కోసం వచ్చే మహిళలపై అసభ్య ప్రవర్తన, సీసీ కెమెరాలో రికార్డయిన పొదలకూరు ఎస్‌బీఐ మేనేజర్‌ నగేష్ వికృత చేష్టలు, బ్యాంకు నుంచి జారుకున్న వైనం

అనంతరం ఓ నిందితుడు ఆ బాలిక ఇష్టంతో ప్రమేయం లేకుండా బలవంతంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయాలను బయట ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ ఆ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను హెచ్చరించి విడిచిపెట్టారు. ఈ ఘటనతో షాక్ తిన్న బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, వారు తొలుత ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తనపై జరిగిన దారుణాన్ని బాలిక వివరించడంతో ఆ 8 మందిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.