Monday Pooja: సోమవారం పరమశివుడిని ఎలా పూజించాలో తెలుసుకోండి, శని ప్రభావంతో పట్టిన కష్టాలను తొలగించుకోండి..
శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా భావిస్తారు. పరమశివుడిని కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం.
శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా భావిస్తారు. పరమశివుడిని కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం. భోళా శంకరుడు ప్రసన్నుడై, భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి . సోమవారం రోజు శివుని ఆరాధన రోజు..ఈ రోజున ఏ శివలింగాన్ని ఏ విధంగా పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.
1. సోమవారం శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే దాని నుంచి బయటపడటానికి మీరు శివుడికి తప్పనిసరిగా ఆవు పాలు సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది.
2. సోమవారం ఉదయమే ఓం నమః శివాయ అనే పంచాక్షరి జపించడం చాలా పవిత్రంగా భావిస్తారు. మీరు కుటుంబ పరంగా కష్టాలు పడుతుంటే సోమవారం శివలింగంపై నీటితో అభిషేకం చేయండి. శివలింగానికి వివిధ రకాల వస్తువులతో అభిషేకం చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు అందుకుంటారు. అంతేకాకుండా శివుడి అనుగ్రహం పొంది సానుకూల ఫలితాలు పొందుతారు.
3. సోమవారం శివ ధ్యానం మీరు శని సంబంధిత దోషంతో బాధపడుతున్నా, కాలసర్ప దోషం ఉన్నా బయటపడటానికి మీరు ప్రత్యేకంగా శివ ధ్యానం చేయాలి. వెంటనే శని దోషం తొలగిపోయి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం
4. శత్రువుల నుంచి ప్రమాదంలో ఉంటే భయాన్ని అధిగమించడానికి మీరు ప్రత్యేకంగా సోమవారం పంచాక్షరి జపించాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో జపించాలి. మీకు ఎటువంటి ఆపదలు ఉన్నా తొలగిపోతాయి.
(The above story first appeared on LatestLY on Apr 11, 2022 01:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

