Stones Pelted At Vande Bharat: వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ పై రాళ్లు రువ్విన ఆగంతకులు.. ప్రారంభించిన నాలుగు రోజులకే.. బెంగాల్‌లో ఘటన.. వీడియోతో..
Credits: Twitter

Kolkata, Jan 3: పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) హౌరా (Howrah) వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ (Vande Bharat Express)  రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రైలు కిటికీ అద్దాలు (Window Glasses) దెబ్బతిన్నాయి. మాల్దాలోని కుమార్‌గంజ్ స్టేషన్‌లో జరిగిందీ ఘటన. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబరు 30న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఈ రైలును ప్రారంభించారు.

ఇంటర్నెట్ వాడే వారికి అలర్ట్.. 2023లో ఈ కీవర్డ్స్ ను గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో అస్సలు వెతక్కండి.. లేకపోతే, ప్రమాదంలో పడతారు. జాగ్రత్త!!

ఇది దేశంలోని ఏడో వందేభారత్ రైలు. హౌరా-న్యూ జల్పాయిగురి స్టేషన్ల మధ్య ఇది నడుస్తోంది. రైలును ప్రారంభించి నాలుగు రోజులు కూడా కాకముందే దుండగులు ఈ రైలుపై రాళ్లతో దాడిచేశారు. ప్రయాణికులతో తొలి ప్రయాణం ప్రారంభించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. రైలు కుమార్‌గంజ్ స్టేషన్‌ను దాటుతున్న సమయంలో దాడి జరిగినట్టు ఈస్టర్న్ రైల్వే తెలిపింది. దుండగులు బయటి  నుంచి రాళ్లు విసిరారని, అద్దాలు పగిలాయని రితు ఘోష్ అనే ప్రయాణికుడు తెలిపాడు. రైలు మాల్దా స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నాడు.

కేన్సర్లతో పోరాడతానన్న మార్టినా.. గొంతు, రొమ్ము కేన్సర్ బారినపడిన టెన్సిస్ దిగ్గజం

అయితే, ఈ దాడిలో రైలులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, ఈ ఘటనతో తాము షాకయ్యామని వివరించాడు. ఈ రాళ్లు దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారన్న విషయంలో స్పష్టత లేదు. రాళ్లదాడి ఘటనపై విచారణకు ఆదేశించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

ఉత్తర కోస్తాలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు