Ola Electric Layoffs: ఓలా ఎలక్ట్రిక్ లో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. జాతీయ మీడియాలో కథనాలు
పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునేందుకుగానూ 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకాలని ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Newdelhi, Nov 23: పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునేందుకుగానూ 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన (Layoffs) పలుకాలని ఓలా (OLA) ఎలక్ట్రిక్ సంస్థ నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సంస్థ ఖర్చులను తగ్గించి, నిర్వాహక సామర్థ్యం పెంచేందుకు ఓలా ప్రయత్నిస్తున్నదని, ఇందులో భాగంగానే అన్ని విభాగాల నుంచి 500 మంది ఉద్యోగులకు గేట్ పాస్ ఇవ్వాలని సదరు సంస్థ నిర్ణయించినట్టు ఆ కథనాలు వివరించాయి. అయితే, ఈ విషయం పై ఓలా ఇంకా స్పందించలేదు. విద్యుత్తు ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ప్రస్తుతం నష్టాలను చవిచూస్తున్న విషయం తెలిసిందే.
Ola Electric To Lay Off 500 Employees Amid Losses: Report https://t.co/NO8pk6bw0c pic.twitter.com/Y6plogBuMG
— NDTV (@ndtv) November 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 23, 2024 10:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

