దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయో కాని తగ్గడం లేదు. గత 24 గంటల్లో 2,58,089 కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిలెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న‌ 358 మంది మ‌ర‌ణించార‌ని వివ‌రించింది. నిన్న క‌రోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 16,56,341 మందికి చికిత్స అందుతోందని తెలిపింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతంగా ఉందని పేర్కొంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 8,209కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 70.37 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. నిన్న‌ ఒక్కరోజే 13,13,444 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు కేంద్రం వివ‌రించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)