Rajya Sabha Chairman Mimicry: రాజ్యసభ చైర్మెన్ను వెక్కిరిస్తూ నాటకం,జగదీప్ ధన్కర్కు ఫోన్ చేసి బాధను వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
మాక్ పార్లమెంట్ నిర్వహించడం ద్వారా రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్(Jagdeep Dhankhar)పై మిమిక్రీ చేసిన విపక్ష సభ్యుల ప్రవర్తనను ప్రధాని మోదీ ఖండించారు. మాక్ పార్లమెంట్ ఘటన దురదృష్టకరమని ప్రధాని అన్నారు
మాక్ పార్లమెంట్ నిర్వహించడం ద్వారా రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్(Jagdeep Dhankhar)పై మిమిక్రీ చేసిన విపక్ష సభ్యుల ప్రవర్తనను ప్రధాని మోదీ ఖండించారు. మాక్ పార్లమెంట్ ఘటన దురదృష్టకరమని ప్రధాని అన్నారు. ఆ ఘటన పట్ల బాధను వ్యక్తం చేసిన ప్రధాని.. రాజ్యసభ చైర్మెన్ జగదీప్కు ఫోన్ చేసి తన విచారాన్ని తెలిపారు.
మంగళవారం సస్పెండ్ అయిన పార్లమెంట్ విపక్ష సభ్యులు.. మకర ద్వారం వద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మెన్ జగదీప్ను వెక్కిరిస్తూ నాటకం వేసిన విషయం తెలిసిందే. టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ.. చైర్మెన్ జగదీప్ తరహాలో నటిస్తూ ఆయన్ను అవమానించారు.రాజ్యాంగబద్దమైన స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తులకు, అది కూడా పార్లమెంట్లో అవమానం జరగడం దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఫోన్లో వెల్లడించినట్లు ధన్కర్ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించారు.
Here's News
Received a telephone call from the Prime Minister, Shri @narendramodi Ji. He expressed great pain over the abject theatrics of some Honourable MPs and that too in the sacred Parliament complex yesterday. He told me that he has been at the receiving end of such insults for twenty…
— Vice President of India (@VPIndia) December 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 20, 2023 02:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

