PC Sreeram: తమిళనాడు గవర్నర్పై సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తీవ్ర విమర్శలు.. బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్
చిత్రపరిశ్రమలో నిత్యం బిజీగా ఉండే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఒక్కసారిగా రాజకీయాలపై మాట్లాడి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై శ్రీరామ్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
Chennai, Jan 7: చిత్రపరిశ్రమలో నిత్యం బిజీగా ఉంటూ, దేశీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ (PC Sreeram) ఒక్కసారిగా రాజకీయాలపై మాట్లాడి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తమిళనాడు (Tamilnadu) గవర్నర్ ఆర్ఎన్ రవిపై (RN Ravi) శ్రీరామ్ ట్విట్టర్లో (Twitter) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆర్ఎన్ రవి రాష్ట్ర గవర్నర్లా కాకుండా ఫక్తు రాజకీయనాయుడిలా మాట్లాడుతున్నారంటూ శ్రీరామ్ తీవ్ర విమర్శలు చేశారు.
హార్లీ డేవిడ్సన్ బైక్ను పాల వాహనంగా మార్చేశాడు.. వీడియో వైరల్
వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదన్న భయం ఆయన యజమానులకు పట్టుకుందని, కాబట్టి ఏదోలా వారికి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఆయన ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రస్తుతం వేర్పాటు వాదానికి, ద్వేషభావానికి మధ్య యుద్ధం జరుగుతోందన్న ఆయన.. గవర్నర్ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
The governer of state has now acted as a politician
His bosses wants to win this election by any means.
Fear has set in .we fought the emergency with commitment to our nation. Now this fight is to stop division & hatered and bring back our country to its past glory.— pcsreeramISC (@pcsreeram) January 5, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 07, 2023 09:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

