Life Imprisonment: పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఆ రాష్ట్రంలో జీవిత ఖైదే... ఆస్తులు కూడా స్వాధీనం.. ఇంతకీ ఎక్కడ??
పోటీ పరీక్షలు, నియామకాల్లో పేపర్ లీక్ కేసులు, స్కామ్ లు ఎక్కువగా నమోదవుతుండడం పట్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ... పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి జీవితఖైదు తప్పదని హెచ్చరించారు.
Newdelhi, Feb 13: పోటీ పరీక్షలు, నియామకాల్లో పేపర్ లీక్ (Paper Leak) కేసులు, స్కామ్ లు (Scams) ఎక్కువగా నమోదవుతుండడం పట్ల ఉత్తరాఖండ్ (Uttarakhand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి జీవితఖైదు (Life Imprisonment) తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హెచ్చరించారు. కనీసం 10 సంవత్సరాలకు తగ్గకుండా శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడినవారికి జైలు శిక్షలే కాకుండా, వారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాగా, గవర్నర్ ఆమోదం కూడా లభించింది.
"Life Imprisonment" For Anyone Caught Cheating In Exams In Uttarakhand https://t.co/rAGqJf4qs1 pic.twitter.com/NLIanDGfbv
— NDTV News feed (@ndtvfeed) February 12, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 13, 2023 09:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

