వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్‌లో పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్ ఫైన‌ల్లోకి ఎల్డోజ్ పౌల్ అర్హ‌త సాధించాడు. క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో అత‌ను 16.68 మీట‌ర్ల దూరం దూకాడు. ఆ రౌండ్‌లో అత‌ను 12వ స్థానంలో నిలిచాడు. వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో భార‌తీయ అథ్లెట్ ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఫైన‌ల్లోకి ప్ర‌వేశించ‌డం ఇదే తొలిసారి. ఎల్డోజ్ పౌల్ త‌న తొలి ప్ర‌య‌త్నంలో 16.12 మీట‌ర్ల దూరం దూకాడు. ఆ త‌ర్వాత త‌న జంప్‌ను ఇంప్రూవ్ చేసి 16.68 మీట‌ర్ల దూరం దూకాడు. ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో పాల్గొన్న ప్ర‌వీణ్ చిత్ర‌వేల్‌, అబ్దుల్లా అబూబాక‌ర్‌లు క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో విఫ‌లం అయ్యారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)