కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణ పతకం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి చేరింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్ లో పీవీ సింధు కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది. తొలి గేమ్ లో 21-15తో నెగ్గిన సింధు రెండో గేమ్ లో 21-13తో కైవసం చేసుకుంది. దీంతో భారత్ షట్లర్ కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి పసిడిని ముద్దాడింది. అంతకు ముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజత పతకం సాధించింది.ఈ స్వర్ణంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 56 పతకాలు సాధించింది. అందులో ఆరు స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)