బర్డ్ ఫ్లూ వైరస్ కారణంలో వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కొద్ది రోజులు చికెన్ తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇక ఇప్పటివరకు కోళ్లకే బర్డ్ ఫ్లూ సోకగా తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ( Bird Flu Infected Humans) సోకిందనే వార్తలు వెలువడుతున్నాయి.
ఉంగుటూరు మండలంలో ఒక వ్యక్తి కి బర్డ్ ఫ్లూ(Bird Flu) నిర్దారణ అయిందని ప్రచారం జరుగుతోంది. కోళ్లఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో సాంపిల్స్ సేకరించారు అధికారులు.
బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయిందనే ప్రచారంతో మేడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాని అప్రమత్తం చేశారు అధికారులు.మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై అధికారుల అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
Bird Flu Detected in a Human at Eluru District!
ఏలూరు జిల్లాలో మనిషికి కూడా సోకిన బర్డ్ ఫ్లూ
ఉంగుటూరు మండలంలో ఒక వ్యక్తి కి బర్డ్ ఫ్లూ నిర్దారణ..
బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడంతో అప్రమత్తమయిన జిల్లా వైద్య శాఖ..
కోళ్లఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో సాంపిల్స్ సేకరించిన అధికారులు..
బర్డ్ ఫ్లూగా నిర్ధారణ… pic.twitter.com/7F2HofdKZg
— Telangana Awaaz (@telanganaawaaz) February 13, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)