తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ హడలెత్తిస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపగా తాజాగా తెలంగాణలోని వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి(Bird Flu Outbreak In Wanaparthy).
వనపర్తి జిల్లా మదనాపురం, ఆత్మకూరు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో(Bird Flu) కోళ్లు మృతి చెందాయి. వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కోళ్ల షెడ్లను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు పశుసంవర్ధక వైద్యులు.
ఇక మరోవార్తను పరిశీలిస్తే హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మారకపోతే హైడ్రాను మూసేస్తాం జాగ్రత్తా అని హెచ్చరించింది . మీరేమన్న దోపిడి దొంగలా? సెలవు రోజుల్లో, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు అంటూ హైడ్రాను నిలదీసింది హైకోర్టు.
Bird Flu Outbreak in Wanaparthy, Chicken Sales Ban
వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి
వనపర్తి జిల్లా మదనాపురం, ఆత్మకూరు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి
వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశం
కోళ్ల షెడ్లను పరిశీలించి శాంపిల్స్ సేకరించిన పశుసంవర్ధక వైద్యులు pic.twitter.com/bA2OH7WhIl
— BIG TV Breaking News (@bigtvtelugu) February 21, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)