నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అచ్చంపేట నుండి హైదరాబాద్‌ దిశగా వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన దెబ్బకు కారు రోడ్డుపై బోల్తాపడి పూర్తిగా ధ్వంసమైంది.ప్రమాదంలో కారు ప్రయాణికులు మద్దెల రమ్య, ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీశారు. అనంతరం వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, మద్యం మత్తులో రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనానాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిన ట్రక్ డ్రైవర్,10 మంది మృతి, 50 మందికి గాయాలు

సాక్షుల ప్రకారం, టిప్పర్ అతివేగంగా నడిపిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఢీకొట్టిన దెబ్బకు కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయిందని వారు చెప్పారు. ప్రమాదం తర్వాత టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, పోలీసులు అతడి కోసం గాలింపు ప్రారంభించినట్లు సమాచారం.అచ్చంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. వాహనాలను పక్కకు తరలించి రహదారిపై ట్రాఫిక్ సర్దుబాటు చేశారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Major Road Accident in Nagarkurnool:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)