భారతీయ ఐటీ చట్టాలకు లోబడి పని చేసేందుకు ఇంతకాలం ససేమిరా అంటోన్న ట్విట్టర్‌ ఎట్టకేలకు అంగీకరించింది. భారత్‌లో ట్విట్టర్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా వినయ్‌ ప్రకాశ్‌ను నియమించింది. ట్విట్టర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. సోషల్‌ మీడియాకు సంబంధించి ఇటీవల కేంద్రం కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టాల ప్రకారం మూడు కీలక పోస్టులైన చీఫ్‌ కంప్లైయిన్స్‌, గ్రీవెన్స్‌, నోడల్‌ అధికారులను నియమించాలని చెప్పింది. కాగా ట్విట్టర్‌ భారతీయులు కానీ వ్యక్తులను ఈ పోస్టులో నియమించి వివాదానికి తెర తీసింది. తాజాగా ఓ మెట్టు దిగి వచ్చిన ట్వీట్టర్ కేంద్ర సూచనలకు తగ్గట్టుగా గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా భారతీయున్ని నియమించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)