Amaravathi, October 8: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇక నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతి వేడుకలు జరపాలన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13న అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో వాల్మీకి జంయంతి వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. మొత్తం రూ.25లక్షల నిధులను కేటాయించింది. ఇందులో అనంతపురం జిల్లాకు రూ.6 లక్షలు, మిగిలిన 12 జిల్లాలకు లక్షన్నర చొప్పున కేటాయించింది. ప్రతి ఏటా అశ్వీయుజ పౌర్ణమి రోజున వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల్లో తెలిపింది. వేడుకలకు జిల్లాలోని వాల్మీకులంతా అనంతపురానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే 2017లోనే తెలంగాణ ప్రభుత్వం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో వేడుకల నిర్వహణను బీసీ సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయం పట్ల బోయ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. విజయదశమి పర్వదినాన పాలపిట్టను చూడాలని చెప్తారు. ఈ పక్షిని చూడటం ద్వారా జీవితంలో ఏం జరుగుతుంది
వాల్మీకి మహర్షి పుట్టు పూర్వోత్తరాలు
వా-state-festival-2731.html" title="Share by Email">