తెలంగాణ

Telangana: డివైడర్‌ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు...20 మందికి తీవ్ర గాయాలు, ఘటన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులు..వీడియో ఇదిగో

Arun Charagonda

సంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లింది,ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.

Harishrao: కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు..దొంగలను తిరిగి పార్టీలోకి చేర్చుకోమన్న హరీశ్ రావు...కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదు..టీడీపీతో కూడా జై తెలంగాణ అనిపించామన్న హరీశ్

Arun Charagonda

ఏ శాఖ కావాలి అంటే నాకు తెలంగాణ శాఖ కావాలని కేసీఆర్ అడిగాడు..నేను శాఖ కోసం, మంత్రి పదవి కోసం రాలేదు.. తెలంగాణ కోసం వచ్చాం అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకంలో రాశారు అని తెలిపారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. సిద్దిపేట దీక్షా దివస్‌లో మాట్లాడిన హరీశ్‌ రావు..తెలుగుదేశం పార్టీతో కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్ అన్నారు.

Telangana: సీఎం రేవంత్ రెడ్డి విగ్రహంతో మాజీ హోంగార్డు దీక్ష, హోంగార్డు వ్యవస్థను పర్మినెంట్ చేయాలని డిమాండ్..వీడియో ఇదిగో

Arun Charagonda

హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, బెల్లంపల్లి పట్టణంలోని తన నివాసంలో రాష్ట్ర హోంగార్డు జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ దీక్ష చేపట్టారు.వచ్చేనెల 6వ తేదిన తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్ వ్యవస్థ 62వ ఆవిర్భవ దినోత్సవాలు ప్రభుత్వం అధికార లాంచనాలతో జరపాలని, హోంగార్డ్ వ్యవస్థను పర్మనెంట్ చేయాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరసన తెలియజేసినందుకు సకినాల నారాయణను ఉద్యోగం నుండి తొలగించింది కేసీఆర్ సర్కార్.

Telangana: వీడియో ఇదిగో, సంగారెడ్డిలో డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

Advertisement

Nagarkurnool: మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత, తిమ్మాజీపేట స్కూల్‌లో ఘటన..వెంటనే డాక్టర్లను పిలిచి చికిత్స చేయించిన టీచర్లు

Arun Charagonda

మధ్యాహ్న భోజనం తిని నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గోరిట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. టమాటో రైస్, గుడ్డు తిన్న నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకోగా.. వెంటనే ఉపాధ్యాయులు వైద్యులను పిలిపించి పాఠశాలలోనే చికిత్స చేయించారు.

Lagacharla: లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ వెనక్కి తీసుకున్న ప్రభుత్వం, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషనన్ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషనన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

Robbery In Wine Shop: ఘరానా దొంగలు..ఏకంగా వైన్స్ షాప్ గోడకే కన్నం వేసి దొంగతనం, శంషాబాద్ మండలం పాలమాకుల వైన్స్‌లో ఘటన

Arun Charagonda

వైన్స్ షాప్ గోడకు కన్నం పెట్టి మద్యం బాటిళ్లు చోరీ చేశారు దొంగలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని SVB లక్ష్మీనరసింహ వైన్స్‌ షాప్ గోడకు తెల్లవారుజామున దొంగలు కన్నం పెట్టి మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. మాస్కులు ధరించి లోపలికి వెళ్లి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు పోలీసులు.

Asifabad: ఆసిఫాబాద్‌లో పులి సంచారం, మహిళపై దాడి..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి...మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా..వీడియో

Arun Charagonda

పులి దాడిలో మహిళ మృతి చెందింది. పత్తి చేనులో పత్తి ఏరుతుండగా లక్ష్మి అనే మహిళపై పులి దాడి చేయగా ఈ దాడిలో మహిళ మృతి చెందింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఘటన చోటు చేసుకోగా ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు.

Advertisement

Telangana: గురుకులంలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..షాక్ తిన్న వైనం, రోజు వారి కూలీలతో వంట..కుళ్లిన గుడ్లు,నీళ్ల సాంబార్...వీడియో ఇదిగో

Arun Charagonda

గురుకులంలో తనిఖీకి వెళ్లి ఖంగుతిన్నారు ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీకి వెళ్లారు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ. వంట మనిషి లేకపోవడంతో రోజువారీ కూలీలతో వంట చేయిస్తున్నారు. స్టోర్ రూంలో కుళ్లి బూజు పట్టిన ఆలుగడ్డలు, ఐఎస్ఐ మార్క్ లేని ఉప్పు ప్యాకెట్లు దర్శనం ఇచ్చాయి.

Child Heart Attack: గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి.. మంచిర్యాల జిల్లాలో ఘోరం

Rudra

డెబ్బై, ఎనభై ఏండ్ల వయసులో రావాల్సిన గుండెపోటు ఇప్పుడు చిన్నరుల్లోనూ కనిపిస్తున్నది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామంలోనూ ఇదే జరిగింది.

Telangana Diksha Divas: తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు.. దీక్షా దివస్, కేసీఆర్ చచ్చుడో - తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ఆమరణ దీక్ష..రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌లో బీఆర్ఎస్ శ్రేణులు

Arun Charagonda

తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ నవంబర్ 29, 2009న చేపట్టిన నిరాహార దీక్షను మరోసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా ఏర్పాట్లు చేశారు.

Nagachaitanya-Sobhita Haldi Function: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. ఫోటోలు వైరల్

Rudra

అక్కినేని హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్ వేడుకలు ఎంతో అంగరంగ వైభోగంగా మొదలయ్యాయి. హల్దీ ఫంక్షన్‌ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

AP Cabinet Meeting: డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం

Rudra

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం డిసెంబర్ 4వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌ మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.

AP Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే? (వీడియో)

Rudra

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టయ్యారు. వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేశారన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు.

BRS Deeksha Diwas: నేడు తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్‌’.. కరీంనగర్ లో పాల్గొననున్న కేటీఆర్

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లుచేసింది.

AP Rain Alert: ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. నేడు, రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అటు తెలంగాణలో చలి పంజా

Rudra

ఏపీకి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందలేదు. నేడు సాయంత్రానికి ఆ వాయుగుండం బలహీన పడుతుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కరైకల్‌ , మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని తెలిపింది.

Advertisement

Class 10 Exam Pattern Revised: ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల విధానంలో కీల‌క మార్పులు, తెలంగాణ స‌ర్కారు తెచ్చిన కొత్త రూల్ ఇదే

VNS

పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై టెన్త్ ఎగ్జామ్స్ లో (Tenth Exams) ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసింది. మొత్తం 100 శాతం మార్కులతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అకడమిక్ ఇయర్ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ పేర్కొంది.

Court Summons To Konda Surekha: మంత్రి కొండా సురేఖ‌కు ఎదురుదెబ్బ‌, నాగార్జున పిటీష‌న్ పై స‌మ‌న్లు జారీ చేసిన నాంప‌ల్లి కోర్టు

VNS

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌కు (Konda Surekha) నాంప‌ల్లి కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున (Nagarjuna) వేసిన ప‌రువున‌ష్టం కేసులో మంత్రి సురేఖ‌కు కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ కేసు విచార‌ణ‌ను నాంప‌ల్లి కోర్టు Nampally Court( డిసెంబ‌ర్ 12వ తేదీకి వాయిదా వేసింది. డిసెంబ‌ర్ 12న జ‌రిగే విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని మంత్రి సురేఖ‌ను కోర్టు ఆదేశించింది.

Telangana: సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పాలని ఐఏఎస్‌ అధికారుల సంఘం డిమాండ్, ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని ఆందోళన

Hazarath Reddy

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సిరిసిల్ల కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల ఐఏఎస్‌ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్‌ ఆరోపణలు సరికాదంటూ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ఖండించింది.

Telangana Fire: వీడియో ఇదిగో, వాంటో సుట్‌కేస్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బోర్లగూడెం గ్రామంలో ఉన్న వంటో సూట్‌కేస్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం.

Advertisement
Advertisement