Congress Leader Pallam Raju: హైడ్రా దౌర్జన్యకాండపై కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఫైర్, కూల్చివేతలు అక్రమం , తనలాంటి వాల్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపాటు!
హైడ్రా పేరిట జరుగుతున్న విధ్వంసంపై జనం మండిపడుతున్నారు. ఏకంగా కాంగ్రెస్ నేతలే .. రేవంత్ రెడ్డి సాగిస్తున్న బుల్డోజర్ దౌర్జన్యకాండను తప్పుబడుతున్నారు . కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేత.. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు.. హైడ్రా తీరును ఆక్షేపించారు.
Hyd, Aug 30: హైడ్రా పేరిట జరుగుతున్న విధ్వంసంపై జనం మండిపడుతున్నారు. ఏకంగా కాంగ్రెస్ నేతలే .. రేవంత్ రెడ్డి సాగిస్తున్న బుల్డోజర్ దౌర్జన్యకాండను తప్పుబడుతున్నారు . కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేత.. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు.. హైడ్రా తీరును ఆక్షేపించారు.
తన సోదరుడు ఆనంద్ నిర్వహిస్తున్న ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ను .. కాంగ్రెస్ సర్కారు కూల్చివేయడంపై .. పల్లంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015 నుంచి ఓఈర్ఓ స్పోర్ట్ విలేజ్ పనిచేస్తున్నదని చెప్పారు. తన సోదరుడు ఆనంద్.. ఏడు ఏకరాల భూమిని లీజుకు తీసుకొని.. సదరు స్పోర్ట్స్ విలేజీని నిర్మించారని చెప్పారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ, పెండింగ్ పనుల వివరాలను సమర్పించాలని అధికారులకు ఆదేశం
Here's Tweet:
T2 - ORO Sports Village
- ORO has been operational since 2015, entirely funded through my brother Anand’s hard earned money.
- Feeling the pain of the vilification of a clean record of 3 generations of public life.
— Mangapati Pallam Raju (@Pallamrajumm) August 29, 2024
అది తన సోదరుడి కాష్టార్జితంలో నెలకొల్పిన సంస్థ అన్నారు. అలాంటి స్పోర్ట్స్ విలేజీని.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అకారణంగా కూల్చివేశారని పల్లంరాజు మండిప్డడారు. ఇదెక్కడి దౌర్జన్యకాండ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత నేత.. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజుకు కుటుంబానికే ఈ పరిస్థితి ఎదురైతే.. ఇక సామాన్యుల గోస పట్టించుకునేదెవరని జనం ఆవేదన వ్యక్తం చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 30, 2024 07:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

