CM Revanth Reddy to meet congress MLAs tomorrow at MCRHRD(X)

Hyd, Feb 5:  తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ అంశం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో(Congress MLAs) రేపు మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానున్నారు. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు.

ఎమ్మెల్యేలను నాలుగు గ్రూపులుగా చేసి వారితో చర్చించనున్నారు ముగ్గురు నేతలు. హైదరాబాద్‌ ఎంసీహెచ్‌ఆర్‌డీ(MCRHRD)లో ఈ సమావేశం జరగనుంది. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో వేర్వేరుగా భేటీ కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

మధ్యాహ్నం 3 గం. నుండి 4. గం వరకు అదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. 4:15 నుండి 5:15 వరకు కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో మీటింగ్ జరగనుంది. వీడియో ఇదిగో, కుల గణన సర్వే రిపోర్ట్‌ని ఉచ్చ పోసి తగలబెట్టాలని మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే అంటున్నాడు, అసెంబ్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

5:30 నుండి 6:30 వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. 6:45 నుండి 7:45 వరకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.