COVID in india | (Photo-PTI)

Hyderabad, August 31:  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 37,791 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,873  మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 800 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 13,65,582 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,24,963కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 360 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  అటు మేడ్చల్ పరిధిలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న మేడ్చల్ నుంచి 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎలాంటి మార్పులేదు,  ఈ జిల్లా నుంచి మరో 129 కేసులు నిర్ధారణయ్యాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైరస్ తీవ్రత కొనసాగుతోంది. నిన్న కరీంనగర్ జిల్లా నుంచి అత్యధికంగా 180 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు ఖమ్మం నుంచి 103, వరంగల్ అర్బన్ నుంచి 94 , నిజామాబాద్ నుంచి 94 మరియు సిద్ధిపేట నుంచి 85 కేసుల చొప్పున నమోదయ్యాయి.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

ఆగష్టు 30న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 827 కు పెరిగింది.

అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 1,849 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 92,837 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,299 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.