Coronavirus in TS| (Photo Credits: PTI)

Hyderabad, October 14:  తెలంగాణలో ఒక వైపు భారీ వర్షాలు, మరోవైపు కరోనావైరస్ ముప్పు రెండూ పొంచి ఉన్నాయి. టెస్టులకు తగినట్లుగా కేసుల సంఖ్యలో కూడా ప్రతిరోజు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 40,056 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1446 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1049 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 36,64,152 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,16,238కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 252 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  రంగారెడ్డి నుంచి 135, మేడ్చల్ నుంచి 131 కేసులు నిర్ధారణయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది, ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, ఖమ్మం తదితర ఉమ్మడి జిల్లాల నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.   రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితికి సంబంధించి రోజూవారీ హెల్త్ బులెటిన్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది.
Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 8 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1241కు పెరిగింది.

అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 1918 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,91,269 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 23,728 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.