![](https://test1.latestly.com/wp-content/uploads/2020/06/covid-19-deaths-380x214.jpg)
Hyderabad, October 8: తెలంగాణలో నిలకడగా కొనసాగుతోంది. ఒకరోజు రోజు తగ్గుతూ, ఒకరోజు మరికొన్ని పెరుగుతూ సుమారుగా ప్రతిరోజు 2 వేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 50,367 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1896 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1363 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,96,839 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,06,644కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 294 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి మరియు మేడ్చల్ పరిధుల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది, కేసుల విషయంలో రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీతో పోటీపడుతోంది. నిన్న రంగారెడ్డి నుంచి 211, మేడ్చల్ నుంచి 154 కేసులు నిర్ధారణయ్యాయి.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/10/ts1-4.jpg)
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/10/ts2-4.jpg)
మరోవైపు గత 24 గంటల్లో మరో 12 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1202కు పెరిగింది.
అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 2067 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,79,075 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,368 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.