![](https://test1.latestly.com/wp-content/uploads/2020/09/COV-380x214.jpg)
Hyderabad, November 2: తెలంగాణలో కొవిడ్ కేసులు మళ్లీ తగ్గాయి, సాధారణంగా వారంతంలో నిర్వహించే వైరస్ నిర్ధారణ పరీక్షలు తక్కువగా ఉంటుండటం వలన అదే మాదిరిగా ప్రతీ సోమవారం కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. తాజాగా వెయ్యి లోపే కేసులు నమోదుకాగా, 14 వందలకు పైగా కోలుకున్నారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 25,643 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 922 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 415 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 43,49,309 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 240,048కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 256 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 56, మేడ్చల్ నుంచి 40, సంగారెడ్డి నుంచి 44, కరీంనగర్ నుంచి 42,మరియు కొత్తగూడెం నుంచి మరో 37 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/11/ts1.jpg)
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/11/ts2.jpg)
మరోవైపు గత 24 గంటల్లో మరో 07 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1348కు పెరిగింది.
అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 1456 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 221,992 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,630 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది