Hyderabad Police: దేశంలో తొలిసారిగా టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్‌పై క్రిమినల్ కేసులు, దేశానికి వ్యతిరేకంగా వీడియోలు వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్, 153 (A) , 121 (A) ,294, 505, రెడ్ విత్ 156(3) కింద కేసులు నమోదు
WhatsApp Logo. Representative Image. (Photo Credits: IANS)

Hyderabad, Feb 27: దేశంలో తమ ప్లాట్‌ఫామ్‌లపై ద్వేషం, దేశ వ్యతిరేక విషయాలను వ్యాప్తి చేయడానికి వీలు కల్పించారనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు (Hyderabad police) మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter), ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp), చైనీస్ షార్ట్-వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌ (TikTok) పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు దేశంలోనే తొలిసారిగా టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

వాట్సాప్‌లో రహస్య ఫీచర్

దేశానికి వ్యతిరేకంగా మత పరమైన వీడియోలు ఉద్దేశ పూర్వకంగా వైరల్ చేస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ ఎస్‌. శ్రీశైలం దాఖలు చేసిన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ తరువాత నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. ఇండియన్ టిక్ టాక్, వాట్సప్ గ్రూప్ ల్లో పాకిస్థాన్ కు చెందిన వారు ఉన్నారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు.

సీఏఏ (CAA), ఎన్‌ఆర్‌సీని (NRC) వ్యతిరేకిస్తున్న వీడియోలు పాకిస్తాన్ వారు పెడితే, ఇండియాలో పెట్టినట్లు వైరల్ చేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ ఆధారాలు పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు చేపట్టాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు నాంపల్లి కోర్టు సూచించింది. రెండు రోజుల్లో టిక్ టాక్, ట్విట్టర్, వాట్సప్ యాజమాన్యాలకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. యాప్ యాజమాన్యాలపై 153 (A) , 121 (A) ,294, 505, రెడ్ విత్ 156(3) కింద కేసులు నమోదు చేశారు.

మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన కారణాల వల్ల వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, మరియు పక్షపాతపూరిత చర్యలు చేయడం వంటి వాటితో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై భారత శిక్షాస్మృతి (ఐపిసి) లోని వివిధ విభాగాల కింద కేసు నమోదైంది. సామరస్యాన్ని కాపాడుకోవడం, యుద్ధం చేయడానికి కుట్ర లేదా యుద్ధం చేయడానికి ప్రయత్నించడం లేదా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, అశ్లీల చర్యలు, బహిరంగ అల్లర్లు మరియు నేరపూరిత కుట్రలకు కారణమయ్యే ప్రకటనలు వంటి వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం కోరింది.

దిశ యాప్ ఎలా వాడాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

దేశంలో సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమైన తరువాత 1,200 కు పైగా గ్రూపులు ఏర్పడ్డాయని, ఇవి దేశ వ్యతిరేక విషయాలను వ్యాప్తి చేస్తున్నాయని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సమూహాలలో కొంతమంది పాకిస్తానీయులు సభ్యులని ఆయన పేర్కొన్నారు.

అతను ట్విట్టర్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్ మరియు దాని ఇండియా ఎండి మనీష్ మహేశ్వరి, వాట్సాప్ ఇంక్ మరియు దాని ఇండియా హెడ్ అభిజిత్ బోస్, మరియు టిక్ టోక్ మరియు దాని అధిపతి నిఖిల్ గాంధీలను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. కాగా వాట్సాప్ ప్రతినిధి మునుపటి ప్రకటనను మళ్లీ పంచుకున్నారు, భారతదేశంలో తన వినియోగదారుల భద్రత గురించి కంపెనీ లోతుగా పట్టించుకుంటుందని తెలిపారు.

ఇంతవరకు ఇలాంటి వాటిపై ట్విట్టర్‌కు ఎలాంటి సమాచారం రాలేదని అంతర్గత వర్గాలు ఐఎఎన్‌ఎస్‌కు తెలిపాయి. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని టిక్‌టాక్ తెలిపింది. భారతదేశంలో వాట్సాప్ 400 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉండగా, టిక్ టాక్ 200 మిలియన్ల వినియోగదారులను దాటింది. స్టాటిస్టా ప్రకారం, 2019 లో ట్విట్టర్ భారతదేశంలో దాదాపు 35 మిలియన్ల మంది క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది.

ఫిబ్రవరి 18 న ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ, ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. తమ వ్యాఖ్యలను కోరుతూ ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని పోలీసు అధికారి తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్న 42 యాప్‌లపై నిషేధం విధించాలని పిటిషనర్ కోరారు.