Web Series on Vikas Dubey: వికాస్ దూబేపై వెబ్ సిరీస్‌, పొలిటికల్ థ్రిల్లర్ పాయింట్‌ను చూపిస్తానంటున్న దర్శకుడు హన్సల్ మెహతా, ప్రాజెక్ట్ కోసం హక్కులను కొనుగోలు చేసిన శైలేష్ కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్

గత నెలలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే జీవితం ఆధారంగా వెబ్ సిరీస్‌ను (Web Series on Vikas Dubey) నిర్మించి, దర్శకత్వం వహించడానికి చిత్రనిర్మాత హన్సల్ మెహతా (Filmmaker Hansal Mehta) సిద్ధమయ్యారు. కాన్పూర్‌లోని చౌబేపూర్ ప్రాంతంలోని బిక్రూ గ్రామంలో దుబేను (Vikas Dubey) అరెస్టు చేయడానికి వెళ్లిన సమయంలో పోలీసులపై దూబే గ్యాంగ్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో డిఎస్‌పి దేవేంద్ర మిశ్రాతో (DSP Devendra Mishra) సహా ఎనిమిది మంది పోలీసులు మరణించారు.

Web Series on Vikas Dubey: వికాస్ దూబేపై వెబ్ సిరీస్‌, పొలిటికల్ థ్రిల్లర్ పాయింట్‌ను చూపిస్తానంటున్న దర్శకుడు హన్సల్ మెహతా, ప్రాజెక్ట్ కోసం హక్కులను కొనుగోలు చేసిన శైలేష్ కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్
Vikas Dubey Arrested (Photo-ANI)

గత నెలలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే జీవితం ఆధారంగా వెబ్ సిరీస్‌ను (Web Series on Vikas Dubey) నిర్మించి, దర్శకత్వం వహించడానికి చిత్రనిర్మాత హన్సల్ మెహతా (Filmmaker Hansal Mehta) సిద్ధమయ్యారు. కాన్పూర్‌లోని చౌబేపూర్ ప్రాంతంలోని బిక్రూ గ్రామంలో దుబేను (Vikas Dubey) అరెస్టు చేయడానికి వెళ్లిన సమయంలో పోలీసులపై దూబే గ్యాంగ్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో డిఎస్‌పి దేవేంద్ర మిశ్రాతో (DSP Devendra Mishra) సహా ఎనిమిది మంది పోలీసులు మరణించారు.

అక్కడి నుంచి పరారైన వికాస్ దూబే కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు (UP Police) జల్లెడపట్టారు. సమాచారం అందిస్తే ఐదు లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఎట్టకేలకు  దూబే పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత అతనిని పోలీసులు తీసుకెళుతుండగా తప్పించుకునే క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికాస్ దూబే మరణించాడు. వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌, దూబే ఆస్తులపై దిమ్మతిరిగే వాస్తవాలు, ఎన్‌కౌంటర్‌పై పోలీసులు ఏమంటున్నారు, కరడుగట్టిన క్రిమినెల్ మృతి ఎపిసోడ్‌పై కీలక విషయాలు మీకోసం

నిర్మాత శైలేష్ ఆర్ సింగ్ యొక్క కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, పోలరాయిడ్ మీడియాతో కలిసి, గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేపై రాబోయే ప్రాజెక్ట్ కోసం హక్కులను కొనుగోలు చేసింది. అలీగఢ్, ఒమెర్టా, జాతీయ అవార్డు గ్రహీత రాజ్కుమ్మర్ రావు నటించిన షాహిద్ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించిన మెహతా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయ్యారు.

దీనిపై దర్శకుడు హన్సల్ మెహతా మాట్లాడుతూ... తాము తీయబోయే ఈ థ్రీల్లర్‌ వెబ్‌ సిరీస్‌ అంత్యంత ఆసక్తికరంగా ఉండబోతుందన్నారు. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఉదంతంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ పాయింట్ ఉందని, దానిని మేము ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పాడు. అది అందరికి ఆశ్చర్యం కలిగిస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు ఇది ప్రస్తుత సమాజాన్ని కూడా చూపిస్తుందన్నాడు.

"నేను మొత్తం కథనాన్ని న్యూస్ ఏజెన్సీలు మరియు ఇతర మార్గాల ద్వారా చాలా దగ్గరగా అనుసరిస్తున్నాను, ఎనిమిది మంది పోలీసులను చంపడం దేశాన్ని కదిలించింది ఈ కథను మొత్తం దేశానికి ఎందుకు చెప్పకూడదని నేను అనుకున్నాను మరియు కొన్ని వాస్తవ వాస్తవాలను తెచ్చి ఈ కథను మీ ముందుకు తీసుకువచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నాను, ”అని సింగ్ అన్నారు.

(The above story first appeared on LatestLY on Aug 10, 2020 06:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).