OG Ticket Price Hike Suspension: విడుదలకు ముందే ఓజీ మూవీకి బిగ్ షాక్, టికెట్ ధరల పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు నిర్వహించడం, టికెట్ ధరలను తాత్కాలికంగా పెంచడం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను సవాల్ చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు.. ప్రభుత్వం ఆదేశాలను నిలిపివేసింది. జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సస్పెండ్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ విడుదలకు ఒక్కరోజు మిగిలి ఉన్న సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సినిమా విడుదలకు ముందే పెద్ద అంచనాలు ఏర్పడిన పరిస్థితిలో.. తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు నిర్వహించడం, టికెట్ ధరలను తాత్కాలికంగా పెంచడం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను సవాల్ చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు.. ప్రభుత్వం ఆదేశాలను నిలిపివేసింది. జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సస్పెండ్ చేశారు.
చిత్ర బృందం రేపు ప్రేక్షకుల ముందుకు ‘ఓజీ’ మూవీని విడుదల చేయడానికి ప్రత్యేక షోలతో పాటు వారం రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకోవాలని కోరింది. అందువలన, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై రూ. 100, మల్టీప్లెక్స్లలో రూ. 150 అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా, ప్రత్యేక బెనిఫిట్ షోల టికెట్ ధరను రూ. 800 వరకు నిర్ణయించవచ్చని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనబడింది.అయితే తెలంగాణ హైకోర్టు ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన పిటిషన్ను విచారించిన తర్వాత.. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. హైకోర్టు తీర్పుతో, ‘ఓజీ’ సినిమాను రాష్ట్రవ్యాప్తంగా సాధారణ టికెట్ ధరలతోనే ప్రదర్శించాల్సి ఉంది.
(The above story first appeared on LatestLY on Sep 24, 2025 06:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

