Prabhas: పదేళ్ల తర్వాత సొంతూరుకు వెళ్తున్న ప్రభాస్.. 28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ
28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ.. పదేళ్ల తర్వాత సొంతూరుకు వెళ్తున్న ప్రభాస్
Amaravati, September 19: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) దాదాపు పదేళ్ల తర్వాత (After a Decade) తన సొంతూరు మొగల్తూరుకు వెళ్తున్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు (Krishnam Raju) ఈ నెల 11న అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభను (Condolence Meet) ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదిలావుంచితే, కృష్ణంరాజు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వచ్చినప్పుడు కృష్ణంరాజు ఇంటికి వెళ్లి ప్రభాస్ ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
(The above story first appeared on LatestLY on Sep 19, 2022 05:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

