Corona Update: విజృంభిస్తున్న కరోనా, కొత్తగా 73,770 పాజిటివ్ కేసులు, 799 మృతి, జూన్‌లో ఫోర్త్ వేవ్ వచ్చే చాన్స్
COVID-19 (Representative Image)

న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 23: భారత్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరోసారి 2 వేల పై చిలుకు కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 4.5 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,527 మందికి పాజిటివ్ గా తేలింది. ఒక్క ఢిల్లీలోనే అత్యధికంగా 1,042 కేసులు నమోదయ్యాయి.

రాధే శ్యామ్ ఫెయిల్యూర్‌పై స్పందించిన ప్రభాస్, ప్రేమ కథల్లో అభిమానులు నన్ను చూడటానికి ఇష్టపడి ఉండకపోవచ్చని తెలిపిన రెబల్ స్టార్

ఇదే సమయంలో దేశంలో 33 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వీటిలో అత్యధిక మరణాలు కేరళలో నమోదయ్యాయి. కేరళలో 31, ఢిల్లీలో 2 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1656 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,079 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసులు పెరుగుతుండటంతో.. దేశంలో పాజిటివిటీ రేటు 0.56 శాతానికి పెరిగి, రికవరీ రేటు 98.75 శాతానికి పడిపోయింది. దేశంలో ఇప్పటి వరకు 187 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు వేశారు.