IMD Alert On Cyclone: ఈ ఏడాది బంగాళాఖాతంలో తొలి తుపాను వచ్చేస్తోంది, ఒడిషాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం, ఏపీలో మరికొద్ది రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతం (బీవోబీ)లో మే 9న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం తెలిపింది.మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని, మే 7న అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారుతుందని, మరుసటి రోజు ఈ వ్యవస్థ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది.
New Delhi, May 4: బంగాళాఖాతం (బీవోబీ)లో మే 9న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం తెలిపింది.మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని, మే 7న అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారుతుందని, మరుసటి రోజు ఈ వ్యవస్థ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది.8న వాయుగుండంగా బలపడిన అనంతరం మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తర దిశగా పయనిస్తూ తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెల్లడించింది.
అల్పపీడనం ఏర్పడ్డాక తుపాను దిశ, కదలిక, వేగం, తీవ్రత వంటి వాటిపై అంచనా వేయాల్సి ఉంటుందని ఐఎండి తెలిపింది. ఈ తుపాను మరింతగా బలపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను పశ్చిమ బెంగాల్, మయన్మార్ల వైపు పయనిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ తుపాను కోస్తాంధ్ర వైపు కూడా రావొచ్చని చెబుతున్నారు.గతంలో మే నెలలో సంభవించిన తుపానులు ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రావడాన్ని వీరు ఉదహరిస్తున్నారు.
గత సంవత్సరం బంగాళాఖాతంలో మే మొదటి వారంలో ‘అసని’ తుపాను ఏర్పడింది. ఇది రాష్ట్రంలోని మచిలీపట్నం – నర్సాపురంల మధ్య తీరాన్ని దాటింది. ఈ తుపాను నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులు ముందుగా కేరళలోకి ప్రవేశించడానికి ఉపయోగపడింది. 2021 మే రెండో వారంలో అరేబియా సముద్రంలో ‘టౌక్టే’ తుపాను ఏర్పడి బంగాళాఖాతంలో రుతుపవనాల ఆగమనానికి తోడ్పడింది.
అదే సంవత్సరం మే 23న బంగాళాఖాతంలో ‘యాస్’ తుపాను సంభవించి సత్వరమే రుతుపవనాల ఆగమనానికి సహకరించింది. ఇది ఒడిశాలోని బాలసోర్ వద్ద తీరం దాటింది. 2020 మే 16న బంగాళాఖాతంలోనే ‘అంఫన్’ తుపాను ఏర్పడింది. ఇది పశ్చిమ బెంగాల్లో తీరాన్ని దాటింది.
రానున్న తుపానుపై..ఐఎండీ డైరెక్టర్ జనరల్ (డీజీ) మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ మే 9 నాటికి అల్పపీడనం ఏర్పడి తుపానుగా మారడంపై ఏకాభిప్రాయం ఉందని తెలిపారు.అల్పపీడనం ఏర్పడిన తర్వాత, మేము ల్యాండ్ఫాల్ మరియు దాని తీవ్రతకు సంబంధించి వివరణాత్మక అంచనాలను అందిస్తామని మోహపాత్ర అన్నారు.మే 7 నుంచి మత్స్యకారులు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని సూచించారు.
ఒడిశా తీరానికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, ఒడిశాపై వ్యవస్థ ప్రభావం గురించి ఎలాంటి అంచనా లేదని డీజీ స్పష్టం చేశారు. తుఫాను గురించి ప్రజలు భయాందోళన చెందవద్దని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మహపాత్ర కోరారు.గత వేసవి తుఫాను 'ఫణి' మే 3, 2019న పూరీకి సమీపంలో ఒడిశా తీరాన్ని దాటింది. ఇది రాజధాని భువనేశ్వర్తో సహా ఒడిశా తీరప్రాంతంలో విస్తృతంగా విధ్వంసం సృష్టించింది.
మరోవైపు భూమిపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తమిళనాడు, కర్ణాటక మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అరేబియన్ సముద్రం వైపు నుంచి గాలులు తోడవడంతో మరికొద్ది రోజులు ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్డీపీఎస్) డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అనేక చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని చెప్పారు.
(The above story first appeared on LatestLY on May 04, 2023 10:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

