Supreme Court: కేంద్రానికి,ఆర్బిఐకి సుప్రీంకోర్టు నోటీసులు, చెల్లించని వాయిదాలపై వడ్డీ వేయడం అన్యాయమని తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది, పిటిషన్పై వచ్చే వారం విచారణ
ఆర్బిఐ మంజూరు చేసిన 3 నెలల తాత్కాలిక నిషేధం తరువాత రుణంపై వడ్డీ వసూలు చేయడాన్ని (Interest On Loans) సవాలు చేస్తూ భారత సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్రానికి, ఆర్బిఐకి ( Centre And RBI) నోటీసు జారీ చేసింది. ఈఎంఐల చెల్లింపుపై మారటోరియంను (Interest On Loans During Moratorium) ఆగస్ట్ 31 వరకూ ఆర్బీఐ పొడిగించిన అనంతరం ఈ పిటిషన్ దాఖలైంది. ఆర్బీఐ తొలుత రుణ వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం ప్రకటించి మరో మూడు నెలల పాటు పొడిగించిందని పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ రాజీవ్ దత్తా పేర్కొన్నారు.
New Delhi, May 26: ఆర్బిఐ మంజూరు చేసిన 3 నెలల తాత్కాలిక నిషేధం తరువాత రుణంపై వడ్డీ వసూలు చేయడాన్ని (Interest On Loans) సవాలు చేస్తూ భారత సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్రానికి, ఆర్బిఐకి ( Centre And RBI) నోటీసు జారీ చేసింది. ఈఎంఐల చెల్లింపుపై మారటోరియంను (Interest On Loans During Moratorium) ఆగస్ట్ 31 వరకూ ఆర్బీఐ పొడిగించిన అనంతరం ఈ పిటిషన్ దాఖలైంది. ఆర్బీఐ తొలుత రుణ వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం ప్రకటించి మరో మూడు నెలల పాటు పొడిగించిందని పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ రాజీవ్ దత్తా పేర్కొన్నారు. మళ్లీ రసకందాయంలో 'మహా' రాజకీయాలు, రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్, మాతోశ్రీలో శరద్ పవార్ & సిఎం ఉద్ధవ్ థాకరే భేటీ
ఆర్బీఐ రుణాలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషనర్ గజేంద్ర శర్మ సర్వోన్నత న్యాయస్ధానంలో (Supreme Court) పిటిషన్ ధాఖలు చేశారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఇప్పుడు ఉపశమనం అవసరమని, చెల్లించని వాయిదాలపై వడ్డీ వేస్తూ చక్రవడ్డీతో నడ్డివిరచరాదని ఆయన సర్వోన్నత న్యాయస్ధానాన్ని అభ్యర్ధించారు.
దేశవ్యాప్త లాక్డౌన్తో ప్రజల రాబడి పడిపోయిన క్రమంలో మారటోరియం సమయంలో రుణ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం అన్యాయమని పిటిషనర్ తరపు న్యాయవాది దత్తా ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్తో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండంగా మారటోరియం సమయంలో చెల్లించని రుణ వాయిదాలపై వడ్డీ భారం మోపడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మాస్కోని ముంబై దాటేస్తోందా?, దేశంలో కోవిడ్ 19 ప్రధాన హాట్ స్పాట్ కేంద్రంగా ముంబై, భారత్లో 1,45,380 కేసులు నమోదు, 4,167 మంది మృతి
కరోనా వైరస్ సంక్షోభంతో వివిధ రంగాల్లో పనిచేసే పలువురు ఉద్యోగులను జీతం చెల్లించకుండా యాజమాన్యాలు సెలవుపై వెళ్లాలని కోరాయని గుర్తుచేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై వచ్చే వారం విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ & జస్టిస్ ఎం.ఆర్. షాలతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులను జారీ చేసింది. అయితే దీనిపై ఇంకా రిజర్వ్ బ్యాంకు స్పందించలేదు.
మార్చి 1, 2020 మరియు మే 31, 2020 మధ్య ఉన్న అన్ని టర్మ్ లోన్లతో సహా అన్ని రకాల వాయిదాల చెల్లింపుపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని అనుమతించడానికి మార్చి 27 న ఆర్బిఐ అన్ని రుణ సంస్థలకు అనుమతి ఇచ్చింది. కొరోనావైరస్-సంబంధిత ఆర్థిక కష్టాలను ఎదుర్కోవటానికి రుణగ్రహీతలకు సహాయపడటానికి అన్ని వర్కింగ్ క్యాపిటల్ రుణాల కోసం మూడు నెలల వాయిదా కూడా అనుమతించబడింది.
ఇదిలా ఉంటే COVID-19 లాక్డౌన్ వ్యవధిలో EMI లు మరియు ఇతర రుణాలు చెల్లించకుండా మినహాయింపుని అనుమతించే రుణ తాత్కాలిక నిషేధ విధానాన్ని బ్యాంకులు అమలు చేస్తున్నాయని ఏప్రిల్ 30 న సుప్రీంకోర్టు తన ఉత్తర్వులలో కోరింది.
(The above story first appeared on LatestLY on May 26, 2020 04:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

