PM Modi Shares Meal With MPs: వీడియో ఇదిగో, ఈ రోజు మీకో పనిష్మెంట్‌ ఇస్తాను అంటూ.. పార్ల‌మెంట్‌ క్యాంటిన్‌లో 8 మంది ఎంపీల‌తో క‌లిసి లంచ్ చేసిన ప్ర‌ధాని

ఈ రోజు పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ (PM Modi) పార్లమెంట్‌ క్యాంటీన్‌ (Parliament Canteen)లో భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యపర్చారు.బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలను ప్రధాని నేడు లంచ్‌కు ఆహ్వానించారు.

PM Modi Shares Meal With MPs: వీడియో ఇదిగో, ఈ రోజు మీకో పనిష్మెంట్‌ ఇస్తాను అంటూ.. పార్ల‌మెంట్‌ క్యాంటిన్‌లో 8 మంది ఎంపీల‌తో క‌లిసి లంచ్ చేసిన ప్ర‌ధాని
PM Narendra Modi Relishes Lunch With MPs at Parliament Canteen

ఈ రోజు పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ (PM Modi) పార్లమెంట్‌ క్యాంటీన్‌ (Parliament Canteen)లో భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యపర్చారు.బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలను ప్రధాని నేడు లంచ్‌కు ఆహ్వానించారు. దీనిగురించి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఎంపీలకు ప్రధాని నుంచి ఫోన్‌ వచ్చింది. ‘పదండి.. ఈ రోజు మీకో పనిష్మెంట్‌ ఇస్తాను’ అని మోదీ వారితో సరదాగా అన్నట్లు సమాచారం.

అనంతరం ఎంపీలతో కలిసి ప్రధాని పార్లమెంట్‌ క్యాంటీన్‌కు వెళ్లారు.దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ లంచ్‌లో ప్రధాని మోదీ పలు విషయాలపై ముచ్చటించినట్లు తెలుస్తోంది. తనతో పాటు ఆ ఎంపీల భోజనానికి అయిన ఖర్చును ప్రధానే చెల్లించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. లంచ్ చేసిన వారిలో బీజేపీ ఎంపీలు హీనా గ‌విట్‌, కోన్య‌క్‌, జ‌మ్‌యంగ్ నంగ్యాల్‌, ఎల్ మురుగ‌న్‌, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేష్ పాండే, బీజేడీ ఎంపీ స‌స్మిత్ పాత్ర ఉన్నారు.

Here's Video and Pics

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 09, 2024 09:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).