Anant Chaturdashi 2025: అనంత చతుర్దశి తేదీ ఇదే.. వినాయకుడి నిమజ్జనం ఏ సమయంలో చేస్తే సకల శుభాలు కలుగుతాయో తెలుసుకోండి

భారతదేశంలో ప్రత్యేకంగా మహారాష్ట్ర, గోవా వంటి ప్రాంతాల్లో జరుపుకునే వినాయక నిమజ్జనంకు ఎంతో గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. పది రోజుల పాటు జరిగే గణేష్ చతుర్థి ఉత్సవాల్లో చివరి రోజు అనంత చతుర్దశిగా పిలుస్తారు. ఈ రోజున భక్తులు గణపతికి వీడ్కోలు చెబుతూ.. నదులు, సరస్సులు లేదా సముద్రంలో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.

Anant Chaturdashi 2025: అనంత చతుర్దశి తేదీ ఇదే.. వినాయకుడి నిమజ్జనం ఏ సమయంలో చేస్తే సకల శుభాలు కలుగుతాయో తెలుసుకోండి
Anant Chaturdashi (Photo Credits: File Image)

భారతదేశంలో ప్రత్యేకంగా మహారాష్ట్ర, గోవా వంటి ప్రాంతాల్లో జరుపుకునే వినాయక నిమజ్జనంకు ఎంతో గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. పది రోజుల పాటు జరిగే గణేష్ చతుర్థి ఉత్సవాల్లో చివరి రోజు అనంత చతుర్దశిగా పిలుస్తారు. ఈ రోజున భక్తులు గణపతికి వీడ్కోలు చెబుతూ.. నదులు, సరస్సులు లేదా సముద్రంలో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఇది కేవలం పండుగ ముగింపు మాత్రమే కాదు. ప్రకృతిలోని సృష్టి–లయ చక్రాన్ని గుర్తుచేసే ఆధ్యాత్మిక క్షణంగా కూడా ఉంటుంది.

ఈ సంవత్సరం అనంత చతుర్దశి సెప్టెంబర్ 6, 2025 శనివారం వస్తోంది. చతుర్దశి తిథి సెప్టెంబర్ 6న తెల్లవారుజామున 03:12 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 7న తెల్లవారుజామున 01:41 గంటలకు అనంత చతుర్దశి ముగుస్తుంది. ఈ కాలంలో గణేష్ నిమజ్జనం చేయడం ద్వారా శ్రేయస్సును, కష్టాలను, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

ఈ రోజున భక్తులు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు వివిధ శుభ ముహూర్తాల్లో గణేష్ నిమజ్జనం నిర్వహిస్తారు.ఉదయం 07:45 నుండి 09:17 వరకు, మధ్యాహ్నం 12:20 నుండి 16:56 వరకు, సాయంత్రం 18:28 నుండి 19:56 వరకు, అలాగే రాత్రి 21:24 నుండి మరుసటి రోజు ఉదయం 01:49 వరకు నిమజ్జనం ముహూర్తాలు ఉన్నాయి. అవసరమైతే మరుసటి రోజు తెల్లవారుజామున 04:45 నుండి 06:13 వరకు కూడా వినాయక నిమజ్జనం చేయవచ్చు. ఈ ముహూర్తాల్లో గణపతిని నిమజ్జనం చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి.

అనంత చతుర్దశి రోజు రోడ్లన్నీ వినాయకుల విగ్రహాలతో కోలాహలంగా ఉంటాయి. ఊరేగింపులు, సంగీతం, నృత్యం, గణపతి బొప్పా మొరియా నినాదాలతో మార్మోగుతుంది.చిన్నా పెద్దా అందరూ గణేష్ విసర్జనలో పాల్గొని గణపతికి వీడ్కోలు చెబుతారు. గణపతి విగ్రహం నిమజ్జనం కేవలం ఒక విగ్రహాన్ని నీటిలో ముంచడమే కాదు, ఇది మన జీవన యాత్రలోని నిర్లిప్తత, అనాసక్తి, ప్రకృతితో ఏకరూపమైపోవడం అనే తాత్వికతను తెలియజేస్తుంది. భక్తులు ఈ రోజు ఆనందంగా గణపతికి వీడ్కోలు చెప్పినా.. ఆయన వచ్చే ఏడాది తిరిగి వస్తారని ఆశతో ముందుకు సాగుతారు.

నిమజ్జన పూజా విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ముందుగా గణేశుడిని పువ్వులు, దుర్వా గడ్డి, మోదకాలు, లడ్డూలతో పూజిస్తారు. దీపం, ధూపం వెలిగించి మంత్రాలతో హారతి ఇచ్చి, పండుగ సమయంలో జరిగిన ఏవైనా తప్పుల కోసం క్షమాపణలు కోరుతారు. భక్తులు ఆయన ఆశీస్సులు కోరుతూ కుటుంబం, స్నేహితుల క్షేమం కోసం ప్రార్థిస్తారు. విగ్రహాన్ని గౌరవపూర్వకంగా నీటిలోకి వేయడం అత్యంత ముఖ్యమైన భాగం. సహజ నీటి వనరులు ఉపయోగించడం ఉత్తమం. అయితే ఇంట్లో పూజ చేసినవారు శుభ్రమైన నీటితో నింపిన టబ్ లేదా బకెట్‌లో నిమజ్జనం చేసి, ఆ నీటిని మొక్కలకు సమర్పించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు.

ఈ సందర్భంగా కొన్ని విషయాలను భక్తులు ఖచ్చితంగా పాటించాలి. విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా విసిరేయరాదు. మురికి లేదా కలుషిత నీటిలో ముంచడం పాపం. పూజలో ఉపయోగించిన పువ్వులు, బియ్యం, ఆకులు వంటి వస్తువులను భక్తితో నిర్వహించి, ప్రకృతికి తిరిగి సమర్పించాలి. పవిత్ర జలాన్ని ఇంటి చుట్టుపక్కల చల్లడం ద్వారా శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

అనంత చతుర్దశి అంటే కేవలం ఒక పండుగ ముగింపు కాదు. అది కొత్త ఆరంభానికి వాగ్దానంగా ఉంటుంది. అందుకే ఈ రోజు గణపతిని గౌరవంతో, భక్తితో, ఆనందంతో వీడ్కోలు చెప్పడం అత్యంత ముఖ్యమైన ఆచారంగా కొనసాగుతోంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి

(The above story first appeared on LatestLY on Sep 01, 2025 07:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).