Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఏప్రిల్, మేనెలలో పట్టిందల్లా బంగారమే, శుభవార్తలు వింటారు...
(Photo Credits: Flickr)

ఈ ఉగాది పర్వదినాన ప్లవ నామ సంవత్సరం పూర్తి చేసుకొని శ్రీ శుభకృత నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 1962 - 1963 లో వచ్చిన శుభకృత్ మళ్లీ 2022 - 2023లో వస్తోంది. అయితే ఈ ఏడాది జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ 4 రాశుల వాళ్ళకి ఎంతో బాగుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ 4 రాశుల వాళ్ళకి అస్సలు తిరుగుండదని… ఏప్రిల్, మే రెండు నెలలు వాళ్ళకి అంతా అదృష్టమే అని ఉంటుందని.. మంచి కలుగుతుందని తెలుస్తోంది. అయితే మరి ఆ రాశులు ఏవి..? వాటిల్లో మీ రాశి కూడా ఉందో లేదో చూసుకోండి.

వృషభ రాశి :

వృషభ రాశి వాళ్ళకి ఆర్థికంగా లాభంని చేకూరుస్తుంది. శుక్రుడు సంచారం వలన మంచిగా ఆర్థిక లాభాలు పొందొచ్చు. అలానే ఈ రాశి వాళ్ళకి ఎప్పటి నుండో ఉన్న పాత బకాయిలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. వచ్చే రెండు నెలలు కూడా ఎంతో సాధిస్తారు. ఎన్నో విజయాలని అందుకుంటారు.

Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి డబ్బులు బాగా సంపాదిస్తారట, మీరు కూడా ఆ రాశిలో ఉన్నారా చెక్ చేసుకోండి..

మేష రాశి:

శుక్రుడు తన స్థానాన్ని మార్చుకోవడం మేషరాశి వారికి ఎంతో శుభప్రదం. మేష రాశి వాళ్ళకి అదృష్టం వస్తుంది. అలానే మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. మీరు ఏ పనినైనా చేసేటప్పుడు చిత్తశుద్ధితో చేయండి. ఇక విజయం తప్పక మీదే. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా మంచి సమయం ఇది. ఉద్యోగస్తులుకి కూడా మంచి కలుగుతుంది.

వృశ్చిక రాశి:

శుక్రుడు మార్పు ఈ రాశి వాళ్ళకి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఉద్యోగులకి మంచి కలుగుతుంది. అలానే ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్లు కూడా ఇదే మంచి సమయం అని చెప్పొచ్చు. ఆదాయం పెరుగుతుంది.

కర్కాటక రాశి:

ఈ రాశి వాళ్లకి వృత్తిపరంగా లాభం వస్తుంది. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నం తప్పక చేయండి ఎందుకంటే మీరు చేసే చిన్నపాటి ప్రయత్నం కూడా మీకు మంచినే ఇస్తుంది.