Nithya menen: తనకు ఇండస్ట్రీలోనే చాలా మంది శత్రువులు ఉన్నారంటున్న నిత్యామీనన్‌
Nitya (Photo Credits: Twitter)

Hyderabad, August 26: అందం, అభినయం కలిగిన హీరోయిన్ గా మాలీవుడ్‌, టాలీవుడ్, కోలీవుడ్‌ లో పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ (Nithya Menen) మూవీ ఇండస్ట్రీపై (Movie Industry) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పెళ్లి గురించి గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందిస్తూ.. తనకు ఇండస్ట్రీలో చాలా మంది శత్రువులు (Enemies) ఉన్నారని అన్నారు.

జీవీ ప్రకాశ్‌కుమార్‌ ను నటుడిగా పరిచయం చేసిన దర్శకుడు ఇక లేరు..

మనం ఎదుగుతున్నప్పుడు గిట్టని వాళ్లు చాలా మంది కాళ్లు పట్టుకుని కిందకు లాగాలని భావిస్తారని అన్నారు. వాళ్ల మాట వినకపోతే వదంతులు ప్రచారం చేయడానికీ వెనుకాడరన్నారు. అయితే, నిత్యా ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారో తెలియాల్సి ఉంది.