Allu Arjun: కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.. శ్రీతేజ్ కు పరామర్శ.. హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను ఆయన పరామర్శిస్తారు.
Hyderabad, Jan 7: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ (Sreetej) ను ఆయన పరామర్శిస్తారు. కిమ్స్ కు వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని అల్లు అర్జున్ కు రాంగోపాల్పేట పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన సమాచారం అందించడంతో ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
Here's Video
శ్రీతేజ్ కోసం కిమ్స్ హాస్పిటల్కు అల్లు అర్జున్ https://t.co/1hzcq95MNX pic.twitter.com/eODey9T4qk
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025
నేడు చిన్నారి శ్రీతేజ్ వద్దకు అల్లు అర్జున్
శ్రీతేజ్ని పరామర్శించడానికి నేడు బేగంపేట కిమ్స్ హాస్పిటల్కు రానున్న అల్లు అర్జున్
కాగా, అక్కడికి వచ్చేందుకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే పోలీసుల నోటీసులు
ప్రస్తుతం బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ షరతులు పాటించాలని పోలీసులు… https://t.co/zh71f2EEtZ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025
ఇదీ కారణం
‘పుష్ప-2’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ను ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ కూడా తనవంతు సాయం అందించారు.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

