Woman Delivers Baby on KRSTC Bus: మానవత్వానికి మచ్చుతునక ఈ ఘటన.. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి బస్సులోనే కేరళ వైద్యుల ప్రసవం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ వీడియో ఇదిగో!!
కేరళలో మానవత్వం పరిమళించే ఘటన ఇది. మలప్పురానికి చెందిన ఓ 37 ఏళ్ల నిండు గర్భిణి కేఎస్ ఆర్టీసీ బస్సులో త్రిస్సూర్ నుంచి కోజీకోడ్ లోని తొట్టిపాలేనికి బయలుదేరింది.
Newdelhi, May 31: కేరళలో (Kerala) మానవత్వం పరిమళించే ఘటన ఇది. మలప్పురానికి చెందిన ఓ 37 ఏళ్ల నిండు గర్భిణి (Pregnant Women) కేఎస్ ఆర్టీసీ బస్సులో (KSRTC Bus) త్రిస్సూర్ నుంచి కోజీకోడ్ లోని తొట్టిపాలేనికి బయలుదేరింది. ఈ క్రమంలో ఆమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని బస్సులోని ప్రయాణికులు డ్రైవర్ కు తెలియజేయడంతో అతను సమయస్ఫూర్తితో ఆలోచించి బస్సు రూటు మార్చాడు. సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఎమర్జెన్సీ డెలివరీ గురించి ఫోన్లో తెలియజేసి బస్సును నేరుగా అక్కడికే పోనిచ్చాడు.
Flash:
A 37-year-old woman passenger in a KSRTC bus went into labour and was immediately taken to the hospital in the bus.
As the delivery was almost over, wasting no time, doctors and staff quickly rushed into the vehicle and helped her to take the child out.
PS. Kudos to… pic.twitter.com/Oafu0uzZrc
— Yuvraj Singh Mann (@yuvnique) May 30, 2024
స్ట్రెచర్ తో సిద్ధంగా ఉన్నప్పటికీ..
అప్పటికే అక్కడ స్ట్రెచర్ తో సిద్ధంగా సిబ్బంది ఆమెను ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో వైద్యులు, నర్సులు హుటాహుటిన బస్సులోకే చేరుకొని ప్రసవం చేసి తల్లీబిడ్డను కాపాడారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బస్సు డ్రైవర్, ఆసుపత్రి వైద్య బృందాన్ని మెచ్చుకుంటున్నారు.
(The above story first appeared on LatestLY on May 31, 2024 10:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

