విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ గ్రేవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ  దేశీయ మార్కెట్‌లోకి ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.1,09,900గా నిర్ణయించింది. 3.22 గంటల్లో పూర్తి స్థాయిలో రీచార్జి కానున్న బ్యాటరీతో ఈ స్కూటర్ 136 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. గంటకు 93 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చునని కంపెనీ సీఈవో విజయ కుమార్‌ తెలిపారు. 3 కిలోవాట్ల ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీతో 30 శాతం అదనంగా బ్యాటరీ లైఫ్‌ ఇవ్వనున్నదన్నారు. ఈ స్కూటర్‌పై కశ్మీర్‌ నుంచి కణ్యాకుమారి వరకు రైడ్‌ చేశారు.

Greaves Electric E-Scooter

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)