Electric Bike: ఒక్క రీచార్జ్ తో 171 కిలోమీటర్లు.. అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ మరో రెండు మోటర్ సైకిళ్లను దేశీయ మార్కెట్ కు పరిచయం చేసింది.
Hyderabad, Nov 24: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన (Electric Bike) తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (EV) మరో రెండు మోటర్ సైకిళ్లను దేశీయ మార్కెట్ (Domestic Market) కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్ తో 171 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మోటర్ సైకిల్ ను 110 సీసీ సామర్థ్యంతో సంస్థ రూపొందించింది. ఎకో డ్రైఫిట్ 350 పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.1,29,999గా నిర్ణయించింది. 3.5 కిలోవాట్ లీ-అయాన్ బ్యాటరీ కలిగిన ఈ బైకు గంటకు 75 కిలోమీటర్ల వేగంగా దూసుకుపోనున్నదని, రోజువారిగా అత్యధికంగా తిరిగేవారికి ఈ బైకుతో నెలకు రూ.7 వేల వరకు ఆదా కానున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ బైకు దేశవ్యాప్తంగా ఉన్న షోరూంలో అందుబాటులో ఉంచినట్టు, కొనాలనుకునేవారు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చునని చెప్పారు.
Pure EV unveils the ecoDryft 350, setting new standards in electric commuting! With a remarkable 171 km range, smart features, and affordability, it's redefining the 110cc segment.
Read the complete news: https://t.co/U8U0WLUZTV… #ecoDryft350 #SustainableMobility #shree1news
— @editorshree1news (@editorshree1ne1) November 23, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 24, 2023 09:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

