సినీ ర‌చ‌యిత‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తండ్రి కేవీ విజ‌యేంద్ర ప్ర‌సాద్ రాజ్య‌స‌భ స‌భ్యునిగా ఇవాళ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు.. విజ‌యేంద్ర ప్ర‌సాద్ చేత ప్ర‌మాణం చేయించారు. రాష్ట్ర‌ప‌తి కోటాలో విజ‌యేంద్ర రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌మాణ‌స్వీకారం అనంత‌రం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో విజ‌యేంద్ర ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర‌ప‌తి కోటాలో రాజ్య‌స‌భ‌కు రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. రాజ్య‌స‌భ‌కు వ‌స్తాన‌ని తాను ఎప్పుడూ ఊహించ‌లేదు. త‌న‌ క‌థ‌లే త‌న‌ను రాజ్య‌స‌భ‌కు తీసుకొచ్చాయి. రాజ్య‌స‌భ‌కు నామినేట్ కావ‌డం త‌న‌ బాధ్య‌త‌ను మ‌రింత పెంచింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను రాజ్య‌స‌భ దృష్టికి తీసుకెళ్తాను అని విజ‌యేంద్ర ప్ర‌సాద్ పేర్కొన్నారు.

విజయేంద్రప్రసాద్ ప్రమాణం చివర్లో 'జైహింద్' అంటూ ముగించారు. అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం కోసం ఇచ్చిన పత్రంలో ఉన్నదే చదవాలని పేర్కొన్నారు. తమ ప్రమాణ పత్రంలో ఉన్న పదజాలానికి ఇతర పదాలను జోడించడం సరికాదని, ఆ అదనపు పదాలు రికార్డుల్లో చేరవని స్పష్టం చేశారు. పైగా, ఎవరైనా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తే వారి ప్రమాణ స్వీకారం తిరస్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు. ఇది సభ్యులందరికీ వర్తిస్తుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)