Hyderabad, June 16: నిన్న గుజరాత్ (Gujarat) తీరాన్ని తాకిన అతి తీవ్ర తుపాను బిపర్‌జోయ్ (Biparjoy) విధ్వంసం సృష్టిస్తోంది. తీరాన్ని తాకిన తర్వాత అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుకు (Severe Cyclone Biparjoy) మారింది. గుజరాత్‌లో విధ్వంసం సృష్టించిన తర్వాత రాజస్థాన్‌కు (Rajasthan) మళ్లింది. ఫలితంగా నేడు, రేపు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. తుపానకు కారణంగా భావ్‌నగర్ జిల్లాలో చిక్కుకున్న మేకలను రక్షించే ప్రయత్నం చేసిన పశువుల యజమాని, అతడి కుమారుడు మరణించగా, మరో 22 మంది గాయపడ్డారు. 23 జంతువులు మృత్యువాత పడ్డాయి. ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తుండడంతో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 524 చెట్లు కుప్పకూలాయి. 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Murmu’s Hyderabad Visit – Traffic Restrictions: నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రేపు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సీజీపీకి హాజరుకానున్న ముర్ము.. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ రోజు, రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)