EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. పెన్షన్ వివరాల సమర్పణకు మరో 3 నెలలు గడువు
అధిక వేతనాలపై పెన్షన్ కు సంబంధించి ఉద్యోగుల జీతాల వివరాల అప్ లోడింగ్ కోసం కంపెనీలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) మరో మూడు నెలలు వెసులుబాటు కల్పించింది.
Newdelhi, Sep 30: అధిక వేతనాలపై పెన్షన్ (Higher Pension) కు సంబంధించి ఉద్యోగుల జీతాల (Employees Salaries) వివరాల అప్ లోడింగ్ కోసం కంపెనీలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) (EPFO) మరో మూడు నెలలు వెసులుబాటు కల్పించింది. డిసెంబర్ 31దాకా గడువు ఇచ్చింది. నిజానికి ఈ నెలాఖరుతోనే గడువు ముగిసిపోతున్నది. అయితే కంపెనీలు, ఆయా సంస్థల ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులతో ఈ ఏడాది ఆఖరుదాకా సమయమిస్తున్నట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి ఇంకా 5.52 లక్షల దరఖాస్తులు.. వ్యాలిడేషన్ ఆప్షన్/జాయింట్ ఆప్షన్ల కోసం పెండింగ్లో ఉన్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది.
Retirement fund body #EPFO extends the #deadline to upload details by #employers for higher pension option by 3-month till December 31
Know More: https://t.co/EC3DqJp4QD#retirement
— Zee Business (@ZeeBusiness) September 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 30, 2023 10:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

