7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, డీఎను 4 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగుల వేతనాలు పెరిగే అవకాశం

కేంద్ర ప్రభుత్వం నేడు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను 4 శాతం మేర పెంచింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 1.16 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలుగనుంది. తాజా పెంపు వల్ల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 38 శాతానికి చేరింది.

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, డీఎను 4 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగుల వేతనాలు పెరిగే అవకాశం
Representative Image (Pic Credit- PTI)

కేంద్ర ప్రభుత్వం నేడు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను 4 శాతం మేర పెంచింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 1.16 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలుగనుంది. తాజా పెంపు వల్ల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 38 శాతానికి చేరింది. ఇదివరకు డీఏ 34 శాతంగా ఉండేది. మోదీ సర్కార్ చివరిగా మార్చి నెలలో డియర్‌నెస్ అలవెన్స్‌ను డీఏ 3 శాతం మేర పెంచింది. ఈ పెంపు 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు వల్ల ఉద్యోగుల వేతనాలు పెరిగే అవకాశం ఉంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 28, 2022 03:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).