Agra: విషాద ఘటన..కళ్లు తిరిగి రైలు కింద పడిపోయిన కానిస్టేబుల్, గూడ్స్ రైలు అతనిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి, ఆగ్రాలో విషాద ఘటన

ఆగ్రాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆగ్రాలోని రాజా కీ మండి రైల్వే స్టేషన్‌లో నిలబడి ఉన్న రైల్వే కానిస్టేబుల్.. ఉన్నట్లుండి కళ్లు తిరిగి రైలు కింద (Constable falls on railway tracks from platform) పడిపోయాడు. ఇక్కడ శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రింగల్ కుమార్.. స్టేషన్‌లో ఉన్నాడు

Agra: విషాద ఘటన..కళ్లు తిరిగి రైలు కింద పడిపోయిన కానిస్టేబుల్, గూడ్స్ రైలు అతనిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి, ఆగ్రాలో విషాద ఘటన
Constable falls on railway tracks from platform (Photo-Video grab)

ఆగ్రాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆగ్రాలోని రాజా కీ మండి రైల్వే స్టేషన్‌లో నిలబడి ఉన్న రైల్వే కానిస్టేబుల్.. ఉన్నట్లుండి కళ్లు తిరిగి రైలు కింద (Constable falls on railway tracks from platform) పడిపోయాడు. ఇక్కడ శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రింగల్ కుమార్.. స్టేషన్‌లో ఉన్నాడు. ఒక గూడ్సు రైలు వెళ్తుండగా ప్లాట్‌ఫాంపై ఉన్నాడతను. రైలుకు సుమారు 5-6 అడుగుల దూరంలో ఉండి పరిసరాలను గమనిస్తున్నాడు. ఇంతలో ఏమైదో కళ్లు తిరిగినట్లు రెండు సార్లు తన చుట్టూ తానే తిరిగాడు.

ఆ తర్వాత బ్యాలెన్స్ కోల్పోయి తూలుకుంటూ వెళ్లి గూడ్స్ రైలు కింద పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజి బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. మరణించిన కానిస్టేబుల్‌ ఉత్తరప్రదేశ్‌లోని బిజనోర్ ప్రాంతానికి చెందిన వాడని, అతనికి భార్య, ఒక నెల వయసున్న పాప ఉన్నారని సమాచారం.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 28, 2022 04:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).