ప్రముఖ భోజ్‌పూరి న‌టుడు, బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీ త‌న భార్య సుర‌భి తివారీకి రెండో సారి తండ్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యకు గ్రాండ్‌గా సీమంతం నిర్వ‌హించారు. ఆ వేడుక‌కు చెందిన వీడియోను ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 51 ఏళ్ల మ‌నోజ్ తివారీకి సుర‌భి రెండ‌వ భార్య‌. ఆమె 2020లో ఓ కూతురుకు జ‌న్మ‌నిచ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ గ‌ర్భం దాల్చింది. గోద్ భ‌రాయి వేడుక‌కు చెందిన వీడియోను ఎంపీ తివారీ షేర్ చేశారు. కొన్ని సంతోషాల‌ను మాట‌ల్లో చెప్ప‌లేమ‌ని, వాటిని అనుభ‌వించాల్సిందే అని త‌న వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Manoj Tiwari (@manojtiwari.mp)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)