BJP MP Gautam Gambhir COVID: బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్కు కరోనా, తనను కలిసిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచన
భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కొవిడ్-19 బారిన పడ్డారు. ఎంపీ గౌతమ్ గంభీర్ కు మంగళవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశారు. కాగా 2022 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్ ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్గా ఉన్నారు.తనకు కరోనా సోకినందున తనను కలిసిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని గౌతమ్ సూచించారు. ‘‘నాకు తేలికపాటి కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించగా ఈరోజు నాకు కొవిడ్కు పాజిటివ్ అని తేలింది. నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ స్వయంగా పరీక్షించుకోమని అభ్యర్థిస్తున్నాను. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’’ అని గంభీర్ మంగళవారం ట్విట్టర్లో తెలిపారు.
After experiencing mild symptoms, I tested positive for COVID today. Requesting everyone who came into my contact to get themselves tested. #StaySafe
— Gautam Gambhir (@GautamGambhir) January 25, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 25, 2022 11:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

